పల్లెలు మెరిశాయి.. జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాయి. కేంద్రం అందించే దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు రెండు గ్రామాలను వరించాయి. సామాజిక భద్రత అంశంలో హన్వాడ మండలం కొనగట్టుపల్లి, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుపై రాజోళి మండలం మాన్దొడ్డి ఎంపికయ్యాయి.
కొనగట్టుపల్లికి రూ.50 లక్షలు, మాన్దొడ్డికి రూ.40 లక్షల బహుమతితో పాటు సర్పంచులకు సత్కారం లభించనున్నది. దీంతో ఆయా గ్రామాలవాసులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీలను సుందరంగా ఉంచి అవార్డులు వచ్చేందుకు కృషి చేసిన సర్పంచులను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అభినందించారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ప థకాలు ప్రజల జీవన ప్రమాణాలను మె రుగుపరుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు జీపీలకు జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డులు దక్కడమే ఇందు కు నిదర్శనం. రాష్ర్టానికి ఐదు అవార్డులు రాగా.. అందులో రెండు ఉమ్మడి జిల్లాకే వచ్చాయి. కేంద్రం ఏటా జాతీయ స్థాయిలో దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను అందజేస్తున్నది.
ఈ క్రమంలో 2021-22కుగానూ శుక్రవారం అ వార్డులను ప్రకటించింది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి.. సామాజిక భ ద్రత, జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామం పేదరిక నిర్మూలన జీవనప్రమాణాల పెంపు అంశాలపై ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. దీంతో ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే వీఎం అబ్రహం, కలెక్టర్లు వల్లూరు క్రాంతి, రవినాయక్ అభినందనలు తెలిపారు. కొనగట్టుపల్లి సర్పంచ్ మానసకు మం త్రి శ్రీనివాస్గౌడ్ ఫోన్ చేశారు.
కొనగట్టుపల్లికి రూ. 50 లక్షలు, మాన్దొడ్డికి రూ.40 లక్షల నజరానాతోపాటు కేంద్ర పురస్కారం అందనున్నది. గత నెల 31న ఈ రెండు పంచాయతీలు రాష్ట్ర ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై.. జాతీయ స్థాయిలో పోటీపడ్డాయి. ఆయా సర్పంచ్లకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు అవార్డులు ఇచ్చిన వారం రోజులకే.. జాతీయ స్థాయిలో ఎంపిక కావడం గమనార్హం.
కొనగట్టుపల్లికి జాతీయ అవార్డు..
కొనగట్టుపల్లి.. కేంద్ర, రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకుని రికార్డు సృష్టించింది. హన్వా డ మండలకేంద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం తెలంగాణ రాకముం దు నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక అంశాలపై అవగాహన లేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి తీసుకున్న చర్యలతో జిల్లాకే ఆదర్శంగా నిలిచిం ది.
ఈ గ్రామంలో 1665 మంది జనాభా, 421 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో స ర్పంచ్గా విజయం సాధించింది. ఈ నాలుగేండ్లల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్లేలా చేసింది. సామాజిక భద్రత అంశంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. వార్డు కమిటీలు వేసుకొని గ్రామసభల ద్వారా సామాజిక భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్, అధికారులు పూర్తి సహకారం అందించడంతో వందశాతం సామాజిక భద్రత సాధించిన పంచాయతీగా నిలిచింది. ప్రతినెలా పౌరహక్కుల దినం, పిల్లలు, మహిళలు, గర్భిణీలు, యుక్తవయస్సు బా లికలకు పౌష్టికాహారం, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్డులు, ప్రాథమిక విద్య, ఉపాధి కల్పన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
రూ.30 లక్షల అందజేస్తా..
కొనగట్టుపల్లి పంచాయతీకి రూ.30 లక్షలు నజరానా అందజేస్తాం. ఈ డబ్బులతో పెద్ద క మ్యూనిటీ హాల్ నిర్మించి అందుబాటులో తీసుకొ స్తాం. జాతీయ స్థాయి అ వార్డు దక్కించుకొని ఆదర్శంగా నిలిచింది. గ్రామాభివృద్ధికి ఎన్ని నిధు లు కావాలన్నా సమకూరుస్తాం. విభిన్నంగా పనిచేసి, ఆలోచన చేసినప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. సామాజిక భద్రత అంశంలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
ఆదర్శంగా కొనగట్టుపల్లి..
మహబూబ్నగర్ జిల్లాకు వరుసగా రెండు సార్లు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు రావడం సంతోషంగా ఉన్నది. హన్వాడ మండలం కొనగట్టుపల్లి పంచాయతీ రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నది. ఇది జిల్లాకే గర్వకారణం. ఇందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. ప్రతి పంచాయతీ కొనగట్టుపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి.
– రవినాయక్, మహబూబ్నగర్ కలెక్టర్