నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 17 : బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో పట్టణంలోని బీసీ కాలనీ క మ్యూనిటీ హాల్లో గురువారం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగున పడిపోతున్న బ్లాక్ ప్రింటింగ్ హస్తకళలో మహిళా సంఘాల స భ్యులకు శిక్షణ అందించి జీవనోపాదులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన స్ప్రాకో సంస్థకు చెం దిన ఏడుగురు నిపుణులు పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు చెందిన 30 మంది మహిళలకు శిక్షణ ఇ స్తారని వివరించారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేయడంతోపాటు బ్యాంకు ద్వారా రుణాలు మంజూ రు చేయించేందుకు కృషి చేస్తారని వారు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి గోపాల్నాయ క్, డీపీఎం రామునాయక్, ఆరుణ్య సీఈవో బాలాజీ, డీపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
ఆదాయ వనరులు పెంచుకోవాలి
మున్సిపాలిటీలో ఆదాయ వనరులు పెంచుకోవాలని క లెక్టర్ హరిచందన సూచించారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశం మందిరంలో గురువారం 2022-23 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ముందు గా ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ముకుందప్పకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత రం అకౌంటెంట్ తిరుమలేశ్ 2022-23 ఏడాదికి సంబంధించిన అంచనా బడ్జెట్ రూ.6146.05ల క్షలు అని తెలుపుతూ వాటి వివరాలు కౌన్సిల్ ఎదు ట ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీకి వివిధ రూపాల లో వస్తున్న ఆదాయం, సిబ్బందికి ఇచ్చే వేతనాలు, ఖర్చులను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులపై ఆధారపడకుండా మున్సిపాలిటీలలో కొత్త అ వకాశాలు ఏర్పర్చుకొని ఆదాయ పెంచుకోవాలని తెలిపారు. ప్రతి 5 ఏండ్లకు ఒకసారి కౌన్సిల్ తీర్మా నం ద్వారా ఇండ్లు, కమర్షియల్ పన్నులను పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఆదాయం కన్నా ఖ ర్చులే ఎక్కువగా ఉన్నాయని, సవరణలు చేసి వారం రో జుల్లో కౌన్సిల్లో ప్రవేశపెట్టాలని చెప్పారు. ప్రస్తుతానికి బ డ్జెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స మావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూ య, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కలెక్టర్
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని ము న్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయతో కలిసి మొక్కలు నాటి నీళ్లుపోశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మున్ముందు రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.