నారాయణపేట రూరల్, నవంబర్ 29 : అన్నిమతాల సారం ఒక్కటేనని, మతపెద్దలను ఒకే వేదికపైకి ఆహ్వానించడం గొప్ప విషయమని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నా రు. మండలంలోని కొలంపల్లి హజ్రత్ సయ్యద్ షా అహ్మ ద్ ఖతాల్ ఉస్సేనీ అష్రఫీ దర్గా ఆవరణలో మంగళవారం దర్గా పీఠాధిపతి సయ్యద్ షా జలాల్ హుసేనీ అస్రఫీ అధ్యక్షతన 21వ సర్వధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించా రు. సమ్మేళనానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ హాజరయ్యారు. ము ందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పేట ప్రాంతంలో అన్ని వర్గాల వారు కలిసిమెలిసి వేడుకలు నిర్వహించుకోవడం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతారన్నారు. దర్గా అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇ చ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో భిన్న మతాల ప్రజలు సోదర భావం, ఐక్యతతో జీవిస్తున్నారన్నా రు.
ఇలాంటి సదస్సుల నుంచి హిందూ ముస్లింల ఐక్యత పెంపొందుతుందన్నారు. తమతమ మతాలు, ధర్మాల ను గౌరవించడంతోపాటు ఇతర మ తాలను కూడా గౌరవించాలన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ అ న్ని మతాల పీఠాధిపతులను ఒకే వేదికపైకి పిలిపించడంపై దర్గా పీఠాధిపతి కృషి అభినందనీయమన్నారు. కాగా కొలంపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు సౌ కర్యం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఎమ్మెల్యే సా నుకూలంగా స్పందించిన ఆయన స మస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు. అనంతరం అస్రఫియా ఎడ్యుకేష న్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వివిధ దర్గాల పీఠాధితులు, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, గుర్మిటికల్ ఎమ్మెల్యే కుమారుడు శరణ్గౌడ, పేట సింగిల్విండో చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ జగదీశ్, సర్పంచ్ సా యిరెడ్డి, ఎంపీటీసీ దామోదర్రెడ్డి, జెడ్పీ కో ఆఫ్షన్ తాజొద్దీన్, ఉపసర్పంచ్ వడెప్ప, నాయకులు, గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.