నారాయణపేట, సెప్టెంబర్ 3 : న్యాయమూర్తులు కేవ లం కోర్టులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు ముందే చట్టాలపై అవగాహన కల్పించి తప్పులు లేకుండా చూసేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైందని జిల్లా ప్రిన్సిపల్ సెన్సేషన్ జడ్జి ఎంఏ రఫీ అన్నారు. వాహనదారు లు, సామాన్యులకు ట్రాఫిక్ నియంత్రణ, చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ ధ్వర్యంలో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అ నంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ చాలా మంది చట్టాలపై అవగాహన లేక తిప్పులు చేస్తుంటారని, అందుకే ప్రజలకు ముం దుగా చట్టాలపై అవగాహన కల్పించాలని జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చట్టం లేకుండా మనం ఉండలేమన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అడ్డందిడ్డంగా వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదన్నారు. అతివేగం చాలా ప్రమాదకరమని, ఎవరూ ప్రోత్సహించరాదన్నారు.
ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీ సుకుంటున్నామన్నారు. లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఇన్సూరెన్స్ తప్పక చేయించుకోవాలన్నారు. రవాణాశాఖ అధికారి వీరస్వామి మాట్లాడు తూ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేయకపోవడం మంచిదని, వా హనాలకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూ చించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ ఎక్కడపడితే అక్కడ చేయరాదని, అకస్మాత్తుగా తిరుగడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నా రు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ అబ్దుల్ సలీం, సీనియర్ న్యాయవాదులు, పోలీస్ అధికారులు, వి ద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.