నారాయణపేట, జూలై 1: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడమేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ ఇస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్దిశాఖ, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో రెండు నెలలపాటు కృష్ణ గోకులం స్కూల్లో జరిగిన గ్రూప్ 1, 4 ఉద్యోగ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ హరిచందన, ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉచిత కోచింగ్ ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్లాలన్నారు. రెండు నెలపాటు తీసుకున్న కోచింగ్ను వృథా చేయకుండా పోటీ పరీక్షల్లో రాణించాలన్నారు. ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో జోనల్ విధానం ఉంద న్నారు. దీనివల్ల 743 పోస్టులు పేట జిల్లా వాసులకే దక్కుతాయన్నారు. కష్టపడితే లక్ష్యసాధన సులభమవుతుందని, పరీక్షలను తెలివిగా ఎదుర్కోవాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వారి భవిష్యత్తే మారిపోతుందన్నారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్ పాల్గొన్నారు.
నిరుపేదల కోసమే ఉచిత కోచింగ్ సెంటర్లు
నిరుపేద విద్యార్థుల కోసమే ఉచిత కోచింగ్ సెంట ర్లను ఏర్పాటు చేసి గత నాలుగు నెలలుగా కోచింగ్ అందిస్తున్నామని కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోని వన్నం పుల్లప్ప కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులు పోటీ పరీక్షలకు దూరం కావొద్దని గ్రామీణ ప్రాంత విద్యా ర్థులకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తూ పీజేఆర్ కోచింగ్ సెంటర్ వారిచే కోస్గిలో కోచింగ్ అందించడం జరిగిందన్నారు. అధ్యాపకుల సూచనల మేరకే వారు తయారు చేసిన స్టడీ మెటీరియల్ను 400 మంది విద్యార్థులకు ఉచితంగా అందించడం జరింగిందన్నారు.
పాఠశాల మైదానానికి భూమిపూజ
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు క్రీడా మైదానం లేకపోవడంతో పట్టణంలోని ఇసుకబావి దగ్గర మైదానానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్చైర్మన్ వేణుగోపాల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.