నారాయణపేట టౌన్, ఏప్రిల్ 2 : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్ అన్నారు. పట్టణంలోని సరాఫ్ బజార్ లో బాలాజీ జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివా రం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ప్రజలకు పచ్చడి, మజ్జిగ పంపిణీ చేసి మాట్లాడారు. ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్త య్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు, అదేవిధంగా ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ దివిత్బట్ట డ్, సాకేత్ బట్టడ్, ప్రకాశ్ బట్టడ్, శ్రీనివాస్ లాహో టి, మల్లేశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని జాజాపూర్లో…
మండలం లోని జాజాపూర్లో కోట్ల ధీరజ్రెడ్డి జ్ఞాపకార్థం కొ త్త కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివా రం గ్రామ సర్పంచ్ కోట్ల సుగందమ్మ పూజ చేసి ప్రారంభించారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రా ములు, నాయకులు పాల్గొన్నారు.
సేవాభావం అలవర్చుకోవాలి
ప్రతిఒక్కరూ సేవాభా వం అలవర్చుకోవాలని సర్పంచ్ నర్సింహులు అ న్నారు. మండలంలోని వడ్వాట్లో ఏర్పాటు చేసి న చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవిని దృ ష్టిలో ఉంచుకొని చలివేంద్రాల ఏర్పాటుకు దాత లు ముందుకు రావాలని పేర్కొన్నారు. చల్లివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చాలని కోరా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుదర్శన్ గౌడ్, ఉపసర్పంచ్ సరస్వతీ, సింగిల్విండో డైరెక్టర్ శ్రీలత, వార్డు మెంబర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.