పట్టణంలోని నారాయణస్వామి శివాలయం, లింగయ్య ఆ లయం నుంచి 135 మంది శివస్వాములు సోమవారం శ్రీశైలాని కి పాదయాత్రగా బయలుదేరివెళ్లారు. గురుస్వాములు ఇరుముడులు కట్టి పూజలు చేయగా, మ హిళల మంగళ హారతులు, శరణుఘోషల మధ్య స్వాములు పాదయాత్రకు తరలివెళ్లారు. 41 రోజులపాటు కఠిన నియమాలతో మాలధారణ చేసి ఇ రుముడులు కట్టుకొని శ్రీశైలంలో సమర్పించడం తో స్వాముల జన్మకు సార్థకత ఏర్పడుతుందని గు రుస్వాములు తెలిపారు. శివస్వాముల వెంట మ హిళలు కూడా పాదయాత్రగా వెళ్లారు.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి …
శివస్వాములు మం డలంలోని మొగ్దుంపూర్ నుంచి శ్రీశైలం మల్లన్న ను దర్శించుకునేందుకు సోమవారం కాలినడకతో బయలుదేరారు. గురుస్వాముల ఆధ్వర్యంలో ఇ రుముడి ధరించి ఆయలం చుట్టూ ప్రదక్షణలు చే శారు. భక్తులు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి శివస్వాములకు ఘనంగా వీడ్కోలు పలికారు. శివరాత్రి నాటికి తమ పాద యాత్ర శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందని శివ స్వాములు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుశీలమ్మ, ఉపసర్పంచ్ వెంకట్రాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
మార్మోగిన మరికల్
మండలకేంద్రంలో సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. గ్రా మంలో శివస్వాములు పడిపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నందికోల సేవ నిర్వహించారు. గురుస్వామి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. కార్యక్రమం లో శివస్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్రీశైలానికి పాదయాత్ర…
మం డలంలోని జాజాపూర్లో హరిజన్ వాడకు చెంది న శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూ జలు నిర్వహించిన శివస్వాములు ఇరుముడితో శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. కు టుంబ సభ్యులు వారికి వీడ్కోలు పలికారు.
స్వాములకు పండ్ల పంపిణీ
మండలంలోని కొల్లంపల్లి సమీపంలో పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములకు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2 వైస్ గవర్నర్ హరినారాయణ భట్టడ్ ఆ ధ్వర్యంలో పండ్లు, మజ్జిగ, నీళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి జనార్దన్, బాలాజీ కాం బ్లే, బాలాజీ ఎక్జోటే, మల్లేశ్ పాల్గొన్నారు.
శివనామస్మరణతో…
శివనామస్మరణతో శివస్వాములు సోమవారం శ్రీశైల మలన్న చెంతకు శ్రీశైలానికి పాదయాత్రగా బయల్ద్దేరి వెళ్లారు. మం డలంలోని వెన్నాచేడ్, రుసుంపల్లి, మహ్మదాబాద్ మండలం జూలపల్లి తదితర గ్రామాల శివస్వాము లు ఇరుముడి కట్టుకొని పాదయాత్రగా వె ళ్లారు. దాదాపు 100మంది స్వాములు ఉమ్మడి గండీడ్ మండల గ్రామాల నుంచి శ్రీశైలానికి బ యలుదేరారు.
కోయిల్కొండ మండలంలో..
మండలంలోని అంకిళ్ల గ్రామం నుంచి శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్రగా సోమవారం తరలివెళ్లారు. అంతకుముందు శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఇడుముడి పూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగింపుగా శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమం లో సర్పంచ్ రజితారవీందర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్ర భాకర్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, దామోదర్రెడ్డి, సురేందర్రెడ్డి, చెన్నయ్య, గోపాల్, శివస్వాములు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని కౌకుంట్ల, రాజోళికి చెందిన శివస్వాములు సోమవారం శ్రీశైలానికి పాదయాత్రగా బయల్దేరా రు. అర్చకులు మఠం సురేశ్స్వామి శివాలయం లో శివస్వాములకు ఇరుముడి కట్టి సాగనంపారు. అనంతరం శివస్వాములు శివనామస్మరణతో పా దయాత్రగా వెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.