నారాయణపేట : వారి చిరకాల స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు జిల్లాలోని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూరైంది. ఎన్నో ఏండ్ల నుంచి మక్తల్ ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మక్తల్ లో మెజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఎన్నో సార్లు కోర్టును ఏర్పాటు చేయాలని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించు కోలేదు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేయాలని ఎంతో పట్టుదలతో కృషి చేశారు. స్థానికంగా కోర్టు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో కోర్టు కేసుల విషయంలో జిల్లా నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో సామాన్యులు న్యాయం కోసం ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తున్నది.
వీటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్లోనే మున్సిపల్ కోర్టును ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో ఉంటుందని భావించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్తల్ పట్టణానికి మున్సిపల్ కోర్టు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అతి త్వరలో ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు, మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ పరిశీలించారు.