ఊట్కూర్, సెప్టెంబర్ 24 : మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని అదన పు కలెక్టర్ చంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రా న్ని సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్థా నిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు వందశాతం వ్యాక్సిన్ పూర్తయిన గ్రామాల వివరాలు అడిగి తెలుసుకొని, మిగ తా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రామ్మనోహర్రావు, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీడీవో కాలప్ప, పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
ముమ్మరంగా వ్యాక్సిన్
మండలంలోని బాపన్పల్లి, క్యాతన్పల్లి, విఠలాపూర్ తోపాటు మండలకేంద్రంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. బాపన్పల్లి లో సర్పంచ్ సత్యమ్మ, ఎంపీటీసీ లక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ టీకా వేయిస్తున్నారు. మండలకేంద్రంలో సర్పంచ్ ఆశమ్మ గ్రామస్తులకు అవగాహన కల్పించి టీకా వేయించారు. వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి స్వ గ్రామంలో 90శా తం టీకాలు వేయించి మండలంలోనే ముం దు వరసలో ఉన్నారని, గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు విఠలాపూర్ గ్రామాన్ని ఆ దర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎంపీపీ బక్క నర్సప్ప కోరారు. మండలం లో మొత్తం 18,000 మందికి టీకా వేశామ ని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో బాపన్పల్లి మాజీ సర్పంచ్ తిప్పన్న, మాజీ ఎంపీటీసీ శేఖర్, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
టీకాకు విశేష స్పందన
టీకా పంపిణీ శిబిరానికి విశేష స్పందన లభించిందని సర్పంచ్ రేణుక అన్నారు. మండలంలోని కుసుమూర్తిలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ శ్రీ మంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సిన్ ప్రక్రియ వందశాతం పూర్తయిందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ టీకా తీ సుకునే విధంగా యువకులు, నాయకుల సమన్వయంతో గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. అనంతరం సర్పంచ్ ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బం ది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తనిఖీ
మండలంలో కొనసాగుతున్న టీ కా పంపిణీ కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి, డీసీఎస్వో శివప్రసాద్రెడ్డి తనిఖీ చేశారు. ఎంపీడీవో రమేశ్కుమార్తో కలిసి పాతర్చేడ్, నర్వ, యాంకి తదితర గ్రామాల్లో ప్రజలకు వేస్తున్న టీకా విధానాన్ని పరిశీలించారు. 18 ఏం డ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకునేలా ప్రజాప్రతినిధులు, ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టీకా తీసుకోవడం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవని ప్రజలు అవగాహన కల్పించి, వందశాతం లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు.
ఇంటింటికీ తిరుగుతూ..
పట్టణంలోని రహ్మని యా కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ వైద్య సిబ్బంది టీకా వేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడానికి స్పె షల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో భాగం గా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేశారు. కాలనీవాసులు టీకా వేసుకోవడానికి సహకరిస్తున్నారని ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు శంషొద్దీన్, నాయకులు పాల్గొన్నారు.