నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 27 : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ హరిచందన అధికారులను కోరారు. సోమవా రం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొత్త పరిశ్రమలను ఏ ర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన అ వసరం ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వ స్తే వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. టీ ప్రైడ్ స్కీం ద్వారా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ వారికి రాయితీ మంజూరు చేశామన్నారు. సమావేశంలో 39 మం ది ఎస్సీలకు, 37 మంది ఎస్టీలకు, ముగ్గురు ది వ్యాంగులకు ప్రభుత్వ రాయితీలు మంజూరు చే శామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చం ద్రారెడ్డి, జీఎం డీఐసీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధికారులు మురళి, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
వాల్పోస్టర్ విడుదల
స్వచ్ఛ భారత్ 2లో భాగంగా మురుగు నీటి ని వారణ, తడి, పొడి చెత్త, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ సుస్థిరత సూచిక వాల్పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయా ల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా వాటిని ప్రదర్శించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో గోడ పెయింటింగ్లు వేయించాలని, ముఖ్య కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వా రా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రరెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, డీ ఈవోలి యాఖత్ అలీ, ఎస్బీఎం సిబ్బంది పాల్గొన్నారు.