నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 27 : ఉద్యమకారుల తరపున న్యాయ పోరాటం చేసిన గొప్ప ప్రజాస్వామికవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ హరిచందన అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కృష్ణమాచారి, జిల్లా అధికారులు, తాసిల్దార్ నాగలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
నారాయణపేట, సెప్టెంబర్ 27 : బడుగు బలహీన వర్గా ల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ చేతన అన్నారు. బాపూజీ జయంతి సం దర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆ యన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, డీసీఆర్బీ సీఐ ఇఫ్తెకార్ అహ్మద్, ఆర్ఐ కృష్ణయ్య, పోలీ స్ సిబ్బంది పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ జ యంతిని ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, నాయకులు, కాంట్రాక్టర్ శరణప్ప, కార్యాలయ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో..
మాగనూర్, సెప్టెంబర్ 27 : మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతిని ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఎంపీపీ శ్యామలమ్మ, సిబ్బం ది ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిబ్బంది పాల్గొన్నారు.