ఊట్కూర్, జనవరి 11 : అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీగా వ్యవహరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా డీ సమావేశానికి ఎమ్మెల్యే మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. ప్రభుత్వం బడ్జెట్లో 50శాతం నిధులను రైతు బంధుకు కేటాయించగా ఈ యాసంగితో 50వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఏవో గణేశ్రెడ్డి తెలిపారు. రైతులు వరికి బ దులు ఇతర పంటలు సాగు చేసుకునేందుకు అన్ని గ్రామా ల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పులిమామిడి, చిన్నపొర్ల ఎస్సీ కాలనీల్లో నేటికీ మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదని, ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని సర్పంచులు రవీందర్రెడ్డి, సూరయ్యగౌడ్, ఎంపీటీసీ రవిప్రసాద్రెడ్డి ఆర్డబ్లూఎస్ ఏఈ వెంకటేశ్పై మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పప్పు సాంబారు మాత్రమే వడ్డిస్తున్నారని జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్ ఎంఈవో వెంకటయ్యను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యవంతమైన భోజనం వడ్డించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపొర్లలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని, శ్మశానవాటికకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్ రవి కోరారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఎఫ్ఏసీ ఎంపీడీవో కొండన్న, ఐసీడీఎస్ పీడీ వేణుగోపాల్, సీడీపీవో జ య, వెటర్నరీ అధికారి మహదేవ్, పీహెచ్సీ వైద్యుడు శ్రీ కాంత్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కా ర్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’
పేద, సామాన్య ప్రజలకు కల్యాణలక్ష్మి వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తాసిల్దార్ తిరుపతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మక్తల్ ఎ మ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేదింటి ఆడపడుచుల తల్లిదండ్రులకు భారం లేకుండా ప్రభుత్వం రూ.లక్షా116 అందజేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 42 మందికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స ర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మా జీ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా శరభలింగేశ్వర స్వామి రథోత్సవం
మండలంలోని తిప్రాస్పల్లిలో మంగళవారం శరభలింగేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం, పల్లకీ సేవ, కుంభము, కలశము, గొడుగు, జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చి ట్టెం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు. స్వామి వారి రథోత్సవంలో భక్తులు పాల్గొని తే రును లాగారు. శీలమంతేశ్వర స్వామి భక్తులకు ప్రవచనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమంగళ, ఎంపీటీసీ రవికుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
యువతకు క్రీడలు చాలా విలువైనవి
యువతకు క్రీడలు చాలా విలువైనవి అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జా తీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళవారం టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపాలం ఆ ధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలు 20 ఏండ్లు పైబడిన యువతీయువకులకు, 17 నుంచి 19 ఏం డ్ల లోపు బాలబాలికలకు ఏర్పాటు చేసిన క్రీడలను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతీయువకులను క్రీడల్లో ప్రో త్సహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం గోపాలం మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఆల్ ఇండియా టగ్ ఆఫ్ వార్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు అమర్, మాజీ ఎంపీటీసీ రవిశంకర్రెడ్డి, రామలిం గం, శేఖర్రెడ్డి, రఘు ప్రసన్నభట్ తదితరులు పాల్గొన్నారు.