కోయిలకొండ/ భూత్పూర్, ఆగస్టు 20 : సీఎం కేసీఆర్ అపరభగీరథుడు అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలో నిర్మితమవుతున్న కరివెన రిజర్వాయర్ను కోయిలకొండ మండల 1000రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో చారిత్రక విజయాన్ని సాధించేందుకు అడుగు దూరంలో ఉంద న్నారు. పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తిచేస్తున్న ఘనుడు సీఎం కేసీఆర్ అని కొనియా డారు. కరువు సీమ కన్నీళ్లు తుడిచేందుకు కృష్ణమ్మ బిరబిరా తరలిరాన్నుదని పేర్కొ న్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అన్ని అవరోధాలను అధిగమించి ముం దుకు సాగుతుందని ఇదంతా సీఎం పోరాట వల్లే సాధ్యమైందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను చేధిస్తూ సీఎం కేసీఆర్ కృషి వల్ల కరువు నెలపై కృషమ్మ పరవళ్లు తొక్కనుందన్నారు.
పాలమూరుకు తీవ్ర ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రత్యక్ష్యంగా, పరోక్ష్యంగా 40పైగా కేసులు వేసి ప్రాజెక్టును పురిట్లోనే గొంతునులిపే ప్రయత్నం చేసిందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ఒంటి చేత్తో తిప్పికొట్టిన జలవిధాత సీఎం కేసీఆర్ అని, అన్నింటికీ ఎదురొడ్డి పాలమూరు-రంగారెడ్డి అనుమతులు సాధించడం సీఎం సాధించిన చారిత్రక విజయమన్నారు. దక్షిణ తెలంగాణలోని ఇది మరో కాళేశ్వరం కానున్నదని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామకొండ చైర్మన్ రవీందర్, ఎంపీపీ శశికళభీంరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కన్వీనర్ మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖాజా, నాయకులు రాజవర్ధన్రెడ్డి, గిరిదారినాగయ్యతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల రైతు కోఆర్డినేతలు, కార్యకర్తలు అధిక సంఖ్య లో తదితరులు పాల్గొన్నారు.