నాగర్ కర్నూల్ : జిల్లాలో ఇటీవలే నిర్వహించిన ప్రత్యేక సభ్యత్వ మత్స్యకారుల సభ్యత్వ నమోదులో నాగర్ కర్నూలు జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు సోమవారం హైదరాబాదులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, కమిషనర్ లచ్చిరామ్ భూక్య జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్పను అభినందించారు.
అంతకుముందు బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవంలో మంత్రి తలసాని పాల్గొని మాట్లాడారు. ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి..ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.