చారకొండ, ఏప్రిల్ 2 : పండుగ పూట ఓ కు టుంబంలో విషాదం నిండింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చో టు చేసుకొని నలుగురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామ సమీపం లో చోటు చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రానికి చెందిన గౌస్ ఖాన్ తన కుటుంబంతో కలిసి స్విఫ్ట్ డిజైర్ కారు(టీఎస్ 29డీ 7547)లో ఏపీలోని కడప పట్టణంలో ఉన్న అమీన్ పీర్ దర్గా దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం తెల్లవారుజామున కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తుర్కలపల్లి గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెను కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులోని గౌస్ ఖాన్(50), అతడి భార్య ఫరహాత్ (45), గౌస్ఖాన్ అక్క నల్లగొండ జిల్లా మల్లేపల్లికి చెందిన సాధికా (55), అల్లుడు రోషన్ జమీర్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. గౌస్ కుమారుడు ఇతియాజ్(21) తీవ్ర గాయాలు కావడంతో 108 వా హనంలో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. స్థానికులు సమాచారం చేరవేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన ప్రాంతానికి చే రుకొని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతిక ష్టం మీద బయటకు తీశారు. అనంతరం కల్వకుర్తి ప్ర భుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
తుర్కలపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమా ద ఘటనా స్థలాన్ని కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, వెల్దండ సీఐ రామకృష్ణతో కలిసి ఎస్పీ మనోహర్ పరిశీలించా రు. చారకొండ ఎస్సై శ్రీనివాస్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన వెంట వెల్దం డ, వంగూరు ఎస్సైలు నర్సింహ, కురుమూర్తి, పోలీసులు ఉన్నారు.
అదుపుతప్పడం వల్లే ప్రమాదం..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన గౌస్ఖాన్ కుటుంబ సభ్యులు వెళ్తున్న కారు అదుపు తప్పడం వల్లే ప్రమాదం చో టు చేసుకొని నలుగురు మృతి చెందారని నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్ తెలిపారు. తుర్కలపల్లి గ్రా మ సమీపంలో ప్రమాదవశాత్తు కారులో మృతి చెందిన వారి వివరాలను ఎస్పీ ఆరా తీశారు. ఉద యం ఆయన కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని మృతదేహాలకు పోస్టుమార్టం విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడుతూ నే రేడుచర్లకు చెందిన గౌస్ఖాన్ కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి ఏపీలోని కడప దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నదన్నారు. నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. హైదరాబాద్కు దవాఖానకు తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆ యన వెంట డీఎస్పీ గిరిబాబు, వెల్దండ సీఐ రామకృష్ణ, ఎస్సైలు శ్రీనివాసులు, గురుమూర్తి, నర్సింహ ఉన్నారు.