నాగర్కర్నూల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాం తాల్లో జీవిస్తున్న చెంచులకు పౌష్టికాహారం అందిం చే కార్యక్రమం అమలు కాబోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా ఆ శించిన స్థాయిలో ఈ ప్రజలు ఆరోగ్యంగా ఉండడం లేదు. అందుకే చెంచులను ఆరోగ్యవంతులుగా చే సేందుకు ఎన్ఐఎన్, ఈఎస్ఐ మెడికల్ కళాశాల, రె డ్క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో పౌష్టికాహారం అం దించే చర్యలను చేపట్టనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటలు ఎంపిక చేశారు. ఈ పంచాయతీల్లో 300 వరకు జ నాభా ఉండగా.. ఇక్కడి ప్రజల్లో చాలా వరకు పోషకాహారం లోపించి రక్తహీనతతో బాధపడుతున్నా రు. ఆరోగ్యవంతుల్లో సాధారణంగా 14 శాతం హి మోగ్లోబిన్ ఉండాల్సి ఉండగా ఇక్కడి ప్రజల్లో 3,4 శాతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. 30 ఏం డ్ల వయస్సుకే వృద్ధాప్య ఛాయలు అలుముకొంటున్నాయి. ఇక గర్భిణులు కాన్పు సమయంలో రక్తం లోపించి ప్రాణాల మీదకు వస్తుంది. దీనివల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు కలుగుతున్నది.
దీంతో పౌష్టికాహార లోపంతో కలిగే నష్టాలను శాశ్వతంగా రూపుమాపేందుకు గవర్నర్ నిర్ణయించారు. ఈ ప్రాంతంలో 25 వేల నుంచి 30 వేల మంది వరకు గిరిజనులు ఉంటారు. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా అప్పాపూర్, భౌరాపూర్ ప్రాంతాల్లో రెడ్క్రాస్, వైద్యాధికారులు సర్వే చేపడుతున్నారు. గతేడాది జరగాల్సిన సర్వే కరోనాతో వాయిదా పడింది. ఇక్కడి చెంచుల్లో ఇప్పటివరకు 16 మందిని గుర్తిం చి హైదరాబాద్ ఎన్ఐఎన్ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకొనే విధానం, దానివల్ల కలిగే లాభాలు, అడవుల్లో పౌష్టికాహారం లభించే ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ మూడు రోజుల పాటు ఉంటుంది. ఇందులో భాగంగా ఉచితంగా వసతి, భోజనం అందిస్తారు. దీనికిగాను స్థానిక రెడ్క్రాస్ అధికారులు చెంచులను ప్రేమతో మాట్లాడి ఒ ప్పించారు. బయటి ప్రాంతానికి రావడానికి ఇష్టపడని ఈ ప్రజలను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా ఈ శిక్షితులు చెంచు పెంటల్లోని ప్రజలకు తర్వాత కాలం లో పూర్తిస్థాయిలో వివరిస్తారు.
అలాగే ఈ శిక్షితులకు హైదరాబాద్లో అసెంబ్లీ, ట్యాంక్బండ్, తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి నాగరిక ప్రపంచం, మారిన సమాజంపై ప్రత్యక్ష అనుభూతి కల్పించనున్నారు. తర్వాత గవర్నర్తో లంచ్ మీటింగ్ ఉంటుంది. ఈ ప్రక్రియ ఈ వేసవి నాటికి పూర్తవుతుంది. కరోనాతో వాయిదా పడుతూ వ స్తోంది. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన పౌ ష్టికాహారం ఆయా పెంటల్లోని ప్రజలకు అందిస్తా రు. దీనివల్ల ఆయా ప్రజల్లో వచ్చే శారీరక మార్పులను నమోదు చేస్తారు. ఇలా రాబోయే మూడేండ్ల లో ప్రజల్లో వచ్చే మార్పులను గుర్తించాక రాష్ట్రం, దేశంలో విస్తృతంగా అమలు చేయనున్నారు. కాగా, నాగర్కర్నూల్ జిల్లాలోని ఈ చెంచు పెంటలను పైలట్ ప్రాజెక్టు కింద గవర్నర్ ఎంపిక చేయడంతో జిల్లా అధికారులు పౌష్టికాహార పంపిణీ పథకం విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక గిరిజనులకు ఉపాధి కల్పించేందుకూ కృషి చేయడం గమనార్హం.
గిరిరాజా కోళ్ల పంపిణీ..
ఇటీవల చెంచులకు గిరిరాజా కోళ్లను హైదరాబాద్లో గవర్నర్ తమిళిసై స్వయంగా అందజేశారు. ఒక్కో కుటుంబానికి 10 రాజశ్రీ కోళ్లను అందించా రు. ఈ కోళ్ల పెంపకంపై పశువైద్యశాఖ ద్వారా అవగాహన కల్పించారు. వీటికి కావాల్సిన దాణా, మం దులను కూడా ఇచ్చారు. ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లతో, మాంసంతో పౌష్టికాహారం అందించాలన్న దే కోళ్ల పంపిణీ లక్ష్యం. ఇదే విధంగా చెంచుల ఇండ్ల ముందు పండ్ల మొక్కలను పెంచనున్నారు. ఇలా చెంచులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నా యి. రెండు చెంచు పెంటల్లో ఈ ప్రక్రియ విజయవంతమైతే మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నా రు. ఈ క్రమంలో శనివారం ఉదయం అప్పాపూర్ చెంచు పెంటకు గవర్నర్ రానున్నారు. చెంచుల స్థి తిగతులు, పౌష్టికాహారం కోసం చేపడుతున్న చర్య లపై చర్చించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
చెంచుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు..
చెంచులకు పౌష్టికాహారం కల్పించి శారీరక ఆరోగ్య పరిరక్షణ కోసం గవర్నర్ తమిళిసై అప్పాపూర్, భౌరాపూర్ పెంటలను దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా చెంచుల కుటుంబాలకు గిరిరాజా కోళ్లను గవర్నర్ స్వయంగా అందజేశారు. త్వరలో పౌష్టికాహారం అందజేస్తారు. దీనికోసం ఇప్పటికే రెడ్క్రాస్ ద్వారా సర్వే చేపట్టాం. త్వరలో చెంచులకు హైదరాబాద్లో శిక్షణ ఇప్పించడం, నాగరిక సమాజంపై అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటాం. శనివారం అప్పాపూర్ చెంచు పెంటలో గవర్నర్ పర్యటించనున్నారు.
– ఉదయ్ కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్