నాగర్కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల అటవీ ప్రాంతంలో అడవి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. గుర్తించిన అటవీ శాఖ అధికారులు దుప్పి కళేబరానికి పశువైద్యాధికారి డాక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. కాగా, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.