నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం దూల్యా నాయక్ తండాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 25 మంది గిరిజన యువకులు ఆదివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దుల్యా నాయక్ తండాకు చెందిన బాషా, దస్తగిరి, గోపాల్ నాయక్, రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు.
అనంతరం ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో నియోజకవర్గానికి మంజూరు అవుతున్న నిధులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి, సోమశిల సిద్ధేశ్వరం వంతెన మంజూరు, సింగోటం శ్రీవారి సముద్రం నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్ కు కృష్ణా నది నీటిని అందించేందుకు గ్రావిటీ కెనాల్ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
అలాగే కొల్లాపూర్ మండలం సింగ పట్నం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆధునీకరణ పనుల కోసం
రూ.15 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొల్లాపూర్ పట్టణంలో రూ.12 కోట్ల వ్యయంతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులతో పాటు
రూ.2 కోట్లతో వెజ్ నాన్వెజ్ మార్కెటింగ్ షెడ్ల నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.