అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో రూ.9 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణానికి గతంలోనే మున్సిపల్ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ రూ. 4.50 కోట్లు మంజూరు చేసి శంఖుస్థాపన చేయగా దానికి అదనంగా మరో రూ. 4.50 కోట్లు కేటాయించి మొత్తం రూ. 9 కోట్లతో మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ను ఓప్పించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు ఎకరాల స్థలం అవసరమని భావించి పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకోని మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అచ్చంపేటలో మార్కెట్ నిర్మాణానికి ఇరిగేషన్శాఖ కార్యాలయం 1.20గుంటల స్థలం తీసుకోవడం జరిగిందని, దీనికి తోడుగా పక్కన అటవీ శాఖ స్థలం కూడా ఉన్నందున అట్టి స్థలం తీసుకుంటే రెండు వైపులా రోడ్డు రావడం, రెండు గేట్లు ఏర్పాటు చేసి ఓకవైపు బయటకు మరోవైపు లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్ అచ్చంపేటకు వచ్చిన సందర్భంలో ప్రకట న కూడా చేయించుకోవడం జరిగిందన్నారు.
తర్వాత మంత్రి కేటీఆర్, అటవీశాఖ అధికారులతో ఫాలోప్ చేస్తున్న సందర్భంలో ఫైల్ వెళ్లేందుకు కొంత ఆసల్యమైందన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ను కలిసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణా నికి కావాల్సిన నిధులు, అటవీశాఖ స్థలం ఇతర అంశాలు వివరించి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ ద్వారా అటవీశాఖ పీసీసీఎఫ్కు ఫోన్ చేయించి అటవీశాఖ స్థలం ఇంటిగ్రే టేడ్ మార్కెట్ నిర్మాణానికి అవసరముంటదని, దాని వల్ల పట్టణంలో వివిధ రకాల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఎంట్రి, ఎగ్జిట్ ఉండడం వల్ల మార్కెట్కు వచ్చే వారికి, వాహనా లకు ఇబ్బంది కాకుండా ఉంటదని కేటిఆర్ పీసీసీఎఫ్కు వివరించినట్లు తెలిపారు. పీసీసీఎఫ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
మార్కెట్ను అద్భుతంగా నిర్మించి అచ్చంపేట ప్రజలకు ఇవ్వడమనేది బాధ్యతగా భావించి పనిచేస్తున్నానని అన్నారు. ప్రజలు సంతోషపడే విధంగా మార్కెట్ను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నానని అన్నారు. ఆలస్యమైన అడుగు పకడ్భందీగా వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నానన్నారు. ఇరిగేషన్ శాఖ స్థలంతో పాటు ప్రభుత్వ దవాఖాన ఎదురుగా ఉన్న అటవీశాఖ స్థలాన్ని కూడా తీసుకోని మార్కె ట్ను అన్ని హంగులతో నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒక్కోక్క సమస్యను అధిగమిస్తువస్తున్నానన్నారు. మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించి అచ్చంపేట ప్రజలకు కానుకగా అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు.