అచ్చంపేట: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం వద్ద అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామాలు, మండల కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసుకోని పార్టీని మరింత బలోపేతం చేయడం జరిగిందన్నారు. నూతనంగా అన్ని విభాగాల్లో నియామమైన కమిటీ సభ్యులు పార్టీ కొసం బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేవిధంగా చూడాలని, గ్రామాలు, పల్లెల్లో సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకో వాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలన్నారు. ఎవరెన్ని కుట్రలు, ఎగిరి గంతులు వేసినా మరో 25ఏండ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంటుందన్నారు.
60లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నర్సింహ్మగౌడ్, మాజీ చైర్మెన్ తులసీరాం, వైస్ చైర్మన్ శైలజరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు రాజేశ్వర్రెడ్డి, అమినోద్దిన్, పులిజాల రమేశ్, గడ్డం రమేశ్ష్, అంతటిశివ, శ్రీనివాస్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.