నాగర్కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మహ్మద్ గౌస్(40) పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో ప్రమాద వశాత్తు మునిగిపోయాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.