ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య
‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి
మౌలిక వసతుల కల్పన
నాగర్కర్నూల్ జిల్లాలో సౌకర్యాల కల్పనకు 290 పాఠశాలలు ఎంపిక
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కు కునేలా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మనబడి’ అమలుతో సర్కారు బడులు సరికొత్త ఒరవడితో బలోపేతం కానున్నాయి. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన జరగనున్నది. మరిన్ని మౌలిక సదుపాయలతో పాఠశాలల రూపురేఖలే మారనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని స్కూళ్లల్లో 12 రకాల సౌకర్యాల కల్పనకు మొదటి విడుతగా 290 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇక విద్యార్థులకు మెరుగైన బోధన అందనున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అ డుగు ముందుకేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లాలో మొదటి విడుతగా 290 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. 12 రకాల మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. దీంతో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నిధుల అంచనా నివేదికలు సమర్పించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టడంతోపాటు సదుపాయాలను మె రుగుపరిచేందుకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కార్ బడులకు ప్రాధాన్యత పెరిగింది. నాగర్కర్నూల్ జిల్లాలో 556 ప్రాథమి క, 128 ప్రాథమికోన్నత, 131 ఉన్నత పాఠశాల లు.. మొత్తం 825 పాఠశాలలు ఉండగా, మొదటి విడుతలో 200 ప్రాథమిక, 45 ప్రాథమికోన్నత, 45 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 4 ప్రకారం మౌలిక వసతులు కల్పించేందుకు ఎంత ఎస్టిమేషన్కు ఏ స్థాయి ఇం జినీరింగ్ అధికారి సాంకేతిక అనుమతి మంజూరు చేయవచ్చని నిర్ధేశించారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఇంజినీర్, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రూ.50 నుంచి రూ.2 కోట్లకుపైబడి చీఫ్ ఇంజినీర్లు అనుమతులిస్తారు. ఇంజినీరింగ్ అధికారులు పాఠశాలను సందర్శించి విద్యా కమిటీ చైర్మన్, హెచ్ఎంలతో చర్చించి వసతుల కల్పనకు అంచనా వ్యయాన్ని నిర్ధేశిస్తారు. స్థాయికి అనుగుణంగా ఒక్కో పాఠశాలకు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. ఈ డబ్బుతో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కావాల్సిన ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్చాక్ బోర్డ్స్, ప్రహరీ, కిచెన్షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, డిజిటల్ విద్య వంటి సదుపాయాలు కల్పించనున్నారు. సర్వశిక్ష అభియాన్, జిల్లా పరిషత్, జాతీయ ఉపాధిహామీ, అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్స్, మండల పరిషత్, నాబార్డు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, గ్రామ పంచాయతీ నిధులను సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారు. వర్క్ ఆర్డర్ మంజూరు చేసే అధికారం కలెక్టర్కు ఉంటుం ది. పాఠశాల స్థాయిలో వి ద్యా కమిటీ చైర్మన్, హెచ్ ఎం, ఇంజినీర్, సర్పం చ్ ఆధీనంలో నిధు లు విడుదల కానున్నాయి.
మా పాఠశాల ఎంపికైంది..
రాష్ట్ర ప్రభుత్వం రూ పొందించిన మన ఊ రు-మన బడి కార్యక్ర మం కింద మా పాఠశా ల ఎంపిక కావడం చా లా సంతోషంగా ఉన్నది. విద్యార్థినులకు మెరుగైన వసతులతోపాటు అన్ని సదుపాయాలు సమకూరుస్తాం. డైనింగ్హాల్, మరుగుదొడ్లు, కిచెన్షెడ్ సుందరీకరణ చేయడంతో ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించనున్నాం. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడితే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అ వకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– లత, హెచ్ఎం, బాలికల పాఠశాల, నాగర్కర్నూల్
గదుల కొరత తీరనున్నది..
జిల్లా కేంద్రంలోని మా పాఠశాలలో గదుల కొరత ఉన్నది. స్కూల్ లో 1,021 మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. మొదటి విడుతలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన ఊరు-మన బడికి పాఠశాల ఎంపికైంది. ఇది విద్యార్థుల అదృష్టం.
– కుర్మయ్య, హెచ్ఎం, బాలుర ఉన్నత పాఠశాల
మన ఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాల ల రూపురేఖలు మారనున్నాయి. 290 పాఠశాలలను మొదటి విడుతలో కలెక్టర్ ఆమోదంతో ఎంపిక చేశాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించనున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడనున్నది. అంతేకాకుండా స్థానికంగా ఆంగ్ల బోధన మెరుగుపడనున్నది.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్