కొల్లాపూర్, జూలై 5: హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనానికి కేరాఫ్ తెలంగాణ మారాలని, అందుకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములుకావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతీబంగారయ్య, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, కలెక్టర్ ఎల్ శర్మన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుసాగుతున్నదన్నారు. నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎల్లూరు, ముక్కిడిగుండం, కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే ముక్కిడిగుండంలోని ప్రకృతివనంలో హరితహారంలో భాగంగా జనం దండుకట్టి మొక్కలు నాటారు. అనంతరం ఎల్లూరు పంచాయతీలో సర్పంచ్ బండిలక్ష్మీదేవమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ప్రజల విజ్ఞప్తులను స్వీకరించారు. ఎల్లూరులో రోడ్డు వెడల్పు నిర్మాణంలో విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్కు అయ్యే ఖర్చు గ్రామ పంచాయతీ నుంచి వెచ్చించమని విద్యుత్ అధికారులు చెబుతున్నట్లు సర్పంచ్ బండిలక్ష్మీదేవమ్మ సభలో వెల్లడించారు.
అలాగే గ్రామంలో పాడైన వీధిలైట్లకు కొత్తగా ఏర్పాటు చేయడానికి ఏజెన్సీలకు అప్పగించడంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అందుకు సంబంధించి డీఎల్పీఏ మాట్లాడుతూ గ్రామంలో ఏ వీధిలో ఏ స్తంభానికి వీధిలైటు ఏర్పాటు చేశారో ఆ సమాచారాన్ని రిజిస్టర్లో రాసి కోటేషన్లు సమర్పిస్తే సరిపోతుందన్నారు. గ్రామంలో 30శాతం మిషన్ భగీరథ పైప్లైన్లు వేయలేదని సర్పంచ్ లక్ష్మీదేవమ్మ సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందుకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు స్పందిస్తూ పైప్లైన్లకు ట్యాప్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఎల్లూరు గ్రామం మీదుగా చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులకుగానూ మరో రూ.2కోట్ల30లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే 57ఏండ్ల్లు నిండి అర్హులైన వారు పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులను సిద్ధం పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు.
పట్టణ ప్రగతిలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య, కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాలని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ఎల్లూరులో కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే బీరంను సర్పంచ్ బండి లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీ మంజుల శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, డీపీఆర్వో సీతారాం, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో లక్ష్మీనర్సింహ, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు పస్పులకృష్ణ, అలివేలు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణయ్య, సింగిల్విండో డైరెక్టర్లు పరశురాంగౌడ్, భోజ్యనాయక్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు వెంకటస్వామి, రుక్మద్ధ్దీన్, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచందర్యాదవ్, ముక్కిడిగుండంలో సర్పంచ్ దశరథ్నాయక్, సింగిల్ విండో మాజీ చైర్మన్ వేణుగోపాల్యాదవ్, మున్సిపల్ ఏఈ విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.