జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 1 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21, 22వ తే దీల్లో న్యాక్బృందం పర్యటించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ తెలిపారు. గురువారం కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన పేరెంట్, స్టూడెంట్స్, టీచర్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపకు లు, విద్యార్థుల సమస్యలపై చర్చించారు. కళాశాలకు ఈనెల 21న న్యాక్బృందం రానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వారు అనుసరించాల్సిన విధానంపై వివరించారు. కళాశాలకు ఉన్నత గ్రేడ్ వచ్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ప్రిన్సిపాల్ కోరారు. సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.