మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 4 : ప్రజల కోసం పగలు రాత్రి అనే తేడాలేకుండా అహర్నిశలు పనిచేస్తున్నామని ఎక్సైజ్, క్రీడాశాఖల మం త్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సతీసమేతంగా హాజరుకాగా మున్నూరుకాపు సం
ఘం నాయకుల క్రేన్ సాయంతో భారీ గజమాలతో మంత్రి దంపతులను సత్కరించి, నాగలి బహూకరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కులాలే వృత్తులుగా మారి నాగరిక సమాజానికి వ్యవసాయం పరిచయం చేశారన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ఎంతో విలువైన భూములను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఆత్మగౌరవ భవనాలలో ఏర్పాటు చేసిన కన్వెన్షన్ సెంటర్లో ఉచితంగా పెండ్లిళ్లు చేసుకొనేలా, విద్యార్థులకు వసతి గృహంతో పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసేలా పాలన సాగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎంతో వెనుకబాటుకు గురైన మహబూబ్నగర్లో ఒక్కప్పుడు భూముల విలువ రూ.లక్షల్లో ఉండేదని ఇప్పుడు కోట్లల్లో పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. రాత్రి పగలు తేడాలేకుండా నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ వద్దనున్న శివాలయం కొండ సమీపంలో రూ.3 కోట్లతో చేపట్టనున్న మున్నూరుకాపు కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ వెంకట య్య, రైతుబంధు సమితి డైరెక్టర్ లక్ష్మయ్య, ము డా డైరెక్టర్ బాలయ్య, మున్నూరుకాపు సంఘం నాయకులు పెంటయ్య, జైపాల్రెడ్డి, కౌన్సిలర్లు వనజ, సంధ్యాశ్రీనివాస్రెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాస్, కేశవులు, సత్తి, నరేందర్తోపాటు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు అభివృద్ధే లక్ష్యం
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 4 : మహబూబ్నగర్ పట్టణాభివృద్ధే తన ముందున్న లక్ష్యమని, సుందరపట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని 44,28, 29,34,36,35,18,04,3,18,19, 40,41వ వార్డుల్లో రూ.17కోట్ల 70లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని రంగాల్లో మహబూబ్నగర్ను అభివృద్ధి చేశామన్నారు. స్వరాష్ట్రంలోనే అభివృద్ధ్ది జరిగిందని, 70ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూయించామని చెప్పారు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పన కృషి చేశామని, ప్రతి వార్డులో పార్కులు అభివృద్ధి చేశామన్నారు.
బైపాస్రోడ్డును గత పాలకులు టైమ్పాస్ చేశారని, మేము బైపాస్ అందుబాటులోకి తెచ్చామన్నారు. అప్పన్నపల్లి మొదటి బ్రిడ్డి నిర్మాణం గతంలో పాలకులు అసంపూర్తిగా వదిలేస్తే ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే పూర్తి చేయించామని, రెండో బ్రిడ్జి నిర్మాణం కేవలం ఏడాదిలో పూర్తి చేశామన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చేప్పే నాయకులను నమ్మవద్దని, పని చేసే వారి అండగా ఉండాలని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు వేదవ్రత్, పద్మ, మోయిన్అలీ, కిశోర్, నర్సింహులు, యాదమ్మ, నర్సింహ, ఫహిమ్సుల్తానా, షబ్బీర్ పాల్గొన్నారు.
తెలంగాణ బిడ్డ మొల్లమాంబ..
పాలమూరు, అక్టోబర్ 4 : మన ప్రాంత ప్రజలకు తెలియని తెలంగాణ జాతి బిడ్డ మొల్లమాంబ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాము డు, సీత, లక్ష్మణుడు గురించి అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అనువాదం చేసిన మొదటి వ్యక్తి మొల్లమాంబ అని మంత్రి పేర్కొన్నారు. కు మ్మరి వృత్తి జాతికి నాగరికతను పరిచయం చేశారన్నారు. గతంలో ప్రభుత్వాలు కుమ్మరులను పట్టించుకోలేదని ఇప్పుడు ఆ వృత్తికి పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో శాలివాహన కమ్యూనిటీ భవనానికి 2వేల గజాల స్థలం, రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గ న్న, కోశాధికారి రవిశేఖర్ తదితరులు ఉన్నారు.
మంత్రికి కిడ్డీ బ్యాంక్ అందజేత
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 4 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్కు చెందిన ప్రభాకర్ కూతురు హరిప్రియ(4వ తరగతి) మంత్రి శ్రీనివాస్గౌడ్పై అభిమానా న్ని చాటుకున్నది. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మోతీనగర్ వచ్చిన మంత్రి కాన్యాయ్ను చూసి పలువురు చిన్నారులు మంత్రి వాహనాన్ని ఆపారు. చిన్నారులను చూసి మంత్రి తన వాహనాన్ని ఆపి కిందికి దిగారు. చిన్నారి హరిప్రియ పొదుపు చేసుకున్న కిడ్డీ బ్యాంక్ను తెచ్చి మం త్రికి ఇచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఖర్చుల కోసం తనవంతు సా యంగా అందిస్తున్నట్లు చెప్పింది. దీంతో చిన్నారి హరిప్రియ తనపై చూపుతున్న అభిమానానికి మంత్రి ఫిదా అయ్యారు.