నారాయణపేట, ఏప్రిల్ 25 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన మంగళవారం నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచపటంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ దక్కాలని తలంచి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు పేర్కొన్నారు. రైతన్నల సంక్షేమం కోసం ఎ న్నో పథకాలు ప్రవేశపెట్టడంతో రాజులా బతుకుతున్నారన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడు తూ ఎన్నో టీఎంసీలు వృథాగా సముద్రంలో క లుస్తున్నాయని.. వాటిని వినియోగించుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ స్థాపించడంతో బీజేపీ, కాం గ్రెస్ నాయకులకు కంటిమీద కునుకు లేకుండాపోయిందన్నారు. తెలంగాణలో అందుతున్న సంక్షేమ పథకాలు గుజరాత్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. స్వాతంత్య్రం వ చ్చి 75 ఏండ్లు పూర్తయినా.. నేటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి ఎంతో అవసరమన్నారు. గద్వాల, నారాయణపేటలో టెక్స్టైల్ పార్కు ఏ ర్పాటు చేస్తామన్న బీజేపీ నాయకుల హామీ ఏ మైందని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ పట్టుదల, కృషితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టి రైతుల పాదాలను కడుగుతామన్నారు. అడిగిన వెం టనే నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు కృతజ్ఞత లు తెలిపారు. పేటలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీకి కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటిని అందించి ఇక్కడి రైతుల కా ళ్లు కడుగుతానన్నారు. తొమ్మిదేండ్ల తన పదవీకాలంలో ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో 49 మంది దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. గ త ఎన్నికల కంటే ఈ సారి రెట్టింపు మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చా రు. అంతకుముందు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు రెండు నిమిషా లపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, నాయకులు పాల్గొన్నారు.