భూత్పూర్, ఫిబ్రవరి 4 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని వెల్కిచర్ల ఉన్నత పాఠశాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు, కిచెన్షెడ్, ప్రహరీ, అదనపు తరగతిగదుల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి మెరుగైన విద్య అం దించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ఇందులో భాగంగా మనఊరు-మనబడి కార్యక్రమం చేపట్టి అన్ని పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆల రఘుపతిరెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రణాళికాబద్ధంగా చదువుకొని పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, సర్పంచ్ పద్మాజక్కీరెడ్డి, జీహెచ్ఎం కవిత, ఉపసర్పంచ్ మహ్మద్ గౌస్, బీఆర్ఎస్ నాయకులు నాగయ్య, బాలస్వామి, నారాయణ, నర్సింహారెడ్డి, దర్శన్గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.