దామరగిద్ద, సెప్టెంబర్ 2 : సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు క్యాతన్పల్లి, చాకలివారిపల్లి, అన్నసాగర్, కానుకుర్తి తదితర గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరై 1,306 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతిఒక్కరికీ పార్టీలకతీతంగా పింఛన్ వ ర్తింపజేశారని పేర్కొన్నారు
. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధితోపాటుగా సంక్షేమంలో నెంబర్వన్గా నిలవడంతోపాటుగా పార్టీలకతీతంగా పథకాలను అర్హులందరికీ అందేలా చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పేదల కష్టాలు చూసి ఆలోచించి వారు ఆర్థికంగా ఎదగడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి ఆసరా పింఛన్లు ఇ స్తున్నామన్నారు. ఇంట్లో వృద్ధులకు పింఛన్ ఇవ్వడంతో వారు ఆత్మగౌరవంతో బతుకుతారన్నారు. తెలంగాణను అభివృద్ధి పథం లో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు సహకరించాల్సిందిపోయి విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ భాస్కర్కుమారి, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, సర్పంచ్ ఆశమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ ఈదప్ప, మాజీ ఎంపీపీ సువర్ణ మ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.