మరికల్, నవంబర్ 17 : అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దత్తనగర్, మాద్వార్రోడ్డు, గజ్జలమ్మగడ్డ, దళితవాడ, శివాజీనగర్, పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు, మెయిన్ రోడ్డు, అశోక్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంట్ కష్టాలు, రైతులకు కన్నీరు తప్పదన్నారు. రైతుల సంక్షేమాన్ని కోరే బీఆర్ఎస్కు రైతులు అండగా నిలవాలని కోరారు.
ఎమ్మెల్యేకు మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి మళ్లీ మీరే గెలవాలని ఆశీర్వదించారు. మరికల్ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు అండగా ఉంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు మహిళలు రాఖీ కట్టారు. అలాగే బీఆర్ఎస్ గెలవాలని చిన్నారి ఆయాన్ ఎమ్మెల్యేకు కారు గుర్తు బొమ్మను అందించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళరెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు గోపాల్, సూజాత, సర్పంచ్ గోవర్ధన్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు హన్మిరెడ్డి, రాజేశ్, రామస్వామి, బసంత్, కొండారెడ్డి, సుధాకర్గౌడ్, రామన్గౌడ్, రాజారెడ్డి, వెంకటేశ్గౌడ్, కృష్ణయ్య, నర్సింహులు, శ్రీనివాసులు, లక్ష్మయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.