ధన్వాడ, నవంబర్ 10 : అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ధన్వాడ మండలంలోని మందిపల్లి, రాంకిష్టయ్యపల్లి, మరుమూలతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు బంద్ చేస్తారని, రైతులు, మహిళలు, యువకులు కష్టాలు తెచ్చుకోవద్దని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వాహిద్, జెడ్పీటీసీ విమలమ్మ, ఎంపీటీసీ ప్రమీలమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎం.వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, వెంకటయ్య, మాదవరెడ్డి, బాలయ్య, హున్యానాయక్, చంద్రశేఖర్, సునీల్రెడ్డి, బాలరాజు, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్, నవంబర్ 10 : కష్టాలు తీర్చే కారుగుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచుతుందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్ మండలంలోని పల్లెగడ్డ, తీలేరు, అప్పంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలని మాట్లాడుతున్నారని, గతంలో కష్టాలు పాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవన్నారు. తీలేరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అప్పంపల్లిలో మ హిళలు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి తిలకందిద్ది బీఆర్ఎస్ కే మా మద్దతు అంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎం పీపీ శ్రీకళరెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సర్పంచ్ ఆంజనేయు లు, నాయకులు రాజవర్ధన్రెడ్డి, సంపత్కుమార్, అశోక్, రాయుడు, కృష్టారెడ్డి, హరీశ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.