నాగర్కర్నూల్, జనవరి 11 : ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’ కార్యక్రమం లో భాగంగా బుధవారం ఉదయం ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మున్సిపాలిటీలోని 6వ వార్డులో పర్యటించారు. కాలనీలో ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగు తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా, ఖాళీ జాగా ల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచాలని కమిషనర్ జయంత్కుమార్కు సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థలాలకు ఫిన్సింగ్ చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సదరు యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించా రు.
పలు వీధుల్లో సీసీ రోడ్లు వేయాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో త్వరలో డ్రైనేజీలు నిర్మించి, సీసీ రోడ్లు వేయనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? లేదా..? అ ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలన్నారు. త్వరలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేశామ ని, ప్రభుత్వం నుంచి మంజూరైన వెంట నే సీసీ రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. అన్ని కాలనీకు ఉన్న లింక్ రోడ్లను సీసీగా మారుస్తామని, రోడ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ ప్రశాంత్ను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తేజ, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.