నాగర్కర్నూల్, మార్చి 11: బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు 50మంది బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే మర్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వార్డుసభ్యులు శ్రీను, భీరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి, రామకృష్ణ, లక్ష్మయ్య, కర్రెన్న, అర్జున్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.