నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/తిమ్మాజిపేట, ఏప్రిల్ 5 : ప్రధాని మోదీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారని.. మరి ఆ హామీ ఏమైందని ఎమ్మెల్సీ, కవి, గాయకు డు దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. చా య్ పే, పరీక్షా పే చర్చా, మన్ కీ బాత్ తప్పా మోదీకి ఏమీ తెలియదన్నారు. తెలంగాణకు ఏం చేస్తారో చెప్పకుం డా మతం పేరుతో కొత్త వేషాలేసుకొని వస్తున్నారని, ఉద్యమం చేసి న తెలంగాణ సమాజం బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేదని తెలిపారు.
తి మ్మాజిపేట మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చా ర్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడు తూ తెలంగాణది ఆత్మగౌరవం, ప్రే మగల్ల, మర్లబ డే స్వభావమన్నారు. దేశంలోని రైల్వే కట్టలు, ఇతర కట్టడాల్లో పాలమూరు పేదల రక్తం ఉందన్నారు. అగ్రకుల మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. సమాజంలో అసమానతలు సృష్టించడమే తప్పా ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. ‘పాలమూరు’కు ఎందు కు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు జాతీయ హోదాతోపాటు నాగర్కర్నూల్కు రైల్వేలైన్ కూడా తీసుకురావాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ రోజూ పూజలు చేస్తారని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న ముస్లింలతో సహా ప్రజలందరినీ ప్రేమించడమే తెలుసని, అలాంటి కేసీఆర్ను హిందూ వ్యతిరేకిగా విమర్శించడం సరికాదన్నా రు.
బీజేపీ డబు ల్ ఇంజన్ రాష్ర్టాల్లో దళితులను కులం పేరుతో హతమారుస్తున్నారని, ఉన్నావ్, హత్రా స్ ఘటనలే ఇందుకు నిదర్శ నం అని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో బీడు భూములన్నీ పచ్చని మాగాణుల్లా మారాయన్నారు. రైతుల కండ్లల్లో నా డు దైన్యం ఉంటే.. ఇప్పుడు మెరుపు కనిపిస్తుందన్నారు. మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలంతా తెలంగాణ పథకాలు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఫ లాలను దేశ ప్రజలకు అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారన్నారు. కొత్త వేషాలేసుకొని వచ్చే పార్టీలను నమ్మొద్దన్నారు. దేశానికి శనేశ్వరాలు వద్దని.. కాళేశ్వరాలు, పాలమూరు ఎత్తిపోతలలు కా వాలన్నారు.
ఇది కొనసాగాలంటే గులాబీ జెండా దే శంలో రెపరెపలాడాలన్నారు. ఎమ్మెల్సీ పట్నం మ హేందర్రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేండ్లల్లో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. మిషన్ కాకతీయ, రై తుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథవంటి పథకా లు ఆదర్శంగా నిలిచాయన్నారు. నాడు పాలమూరు ఎడారిగా ఉండి వలసలు పోయే పరిస్థితులు ఉండేవ ని, ఇప్పుడు పాడి పంటలతో పచ్చగా మరిందన్నారు. ఈ అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీ సుకెళ్లాలన్నారు. అంబేద్కర్, జగ్జీవన్రామ్ కలల సా కారం దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామ న్నారు. పేదల కోసం పని చేస్తున్నది బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. సీఎం కేసీఆర్ దేశానికి మార్గం చూపే లా పథకాలు అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
అనంతరం వేలాది మంది నాయకులు, కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. మహిళలంతా కోలాటాలు, బతుకమ్మలతో సందడి చేశారు. అంత కుముందు మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే మర్రి సతీమణి జమున, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ప్రదీప్, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, వైస్ ఎం పీపీ శ్రీనివాస్ యాదవ్, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ రాందేవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.