లింగాల, నవంబర్ 28: నల్లచట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతులపై కన్నెర్ర చేస్తూ ఉసురుపోసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చి రైతుల మరణాలకు కారణమైందని ఆరోపించారు. వడ్లు కొనుగోలు చేసే విషయంలో కేంద్రం రెండునాలుకల ధోరణి అవలంభిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు ఉద్యమం చేస్తూనే మరోపక్క రైతు మద్దతు ధరతో యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దు.. ప్రతిగింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కాల్వలను ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో 70శాతం కేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. మండలంలోని మాడాపూర్ గ్రామంలో సబ్సిడీ ద్వారా 26మంది రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటగిరి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రవిశంకర్, సీనియర్ నాయకులు కేటీ తిరుపతయ్య, మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, ఏవో నాగార్జునరెడ్డి, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, డైరెక్టర్లు శంకర్నాయక్, నర్సింహ, బాలరాజుగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా..
విద్యుత్ ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతిచెంది పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని శివారుతండా గ్రామ పంచాయతీ పరిధిలో 2018లో విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన ఇస్లావత్ గోపాల్ భార్య కమలకు రూ.5లక్షల పరిహారాన్ని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షలను మంజూరు చేయించి ఆ కుటుంబానికి అండగా నిలవడంపై మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్, శివారు గ్రామ సర్పంచ్ జగన్, గ్రామస్తులు రాంలాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ముదిరాజ్ కమిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
పట్టణంలోని అంకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ముదిరాజ్ కమిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్, ఆలయ అధ్యక్షుడు ముక్తాల వెంకటేశ్, పిట్టల శంకర్, మందుల దశరథం, ముక్తాల రేణయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రెడ్డి, పర్వతాలు, బాలస్వామి, ఆకుల శ్రీను, మన్నుపటేల్, మిద్దె నాగరాజు, బాలయ్య, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.