గద్వాల, డిసెంబర్ 3: దివ్యాంగులమని ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో దివ్యాంగ దినోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. దివ్యాంగులు సవ్యాంగులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.
దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పారు. దివ్యాంగులకు నావంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ విజయ్కుమార్, కౌన్సిలర్లు నరహరిశ్రీనివాసులు, మహేశ్, నాయకులు చక్రధర్రావు, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్, కురుమన్న, నర్సింహారెడ్డి, దివ్యాంగుల అధ్యక్షుడు చంటి తదితరులు పాల్గొన్నారు.
గద్వాలటౌన్, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళితే దేనినైనా సాధించగలరని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం మెప్మా ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు అన్నివిధాలా అండ గా ఉంటామన్నారు. దివ్యాంగులను సంఘాలుగా ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతరం దివ్యాంగులను పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ నరసయ్య, కౌన్సిలర్ శ్రీనివాసులు, మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, టీఎంసీ శ్రీకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
గద్వాల, డిసెంబర్ 3: దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగుల సాధికారిత కోసం, విద్య, ఉపాధి, ఆరోగ్య భద్రత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తుందన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి విభజించి దివ్యాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత సంస్థగా మార్చుతూ జీవో విడుదల చేసిందన్నారు.
ప్రత్యేకశాఖ ఏర్పాటుతో దివ్యాంగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించబడతాయన్నారు. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన దివ్యాంగులు ఏ విషయంలో తక్కువ కాదని, మనసుంటే మార్గముంటుందనే విధంగా అవరోధాలను ఎదుర్కొని ముందుకెళ్లాలని, నిత్యచైతన్యవంతులుగా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నోరకాల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి ముషాయిదా బేగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు, అంధుల పాఠశాల విద్యార్థులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.