తెలకపల్లి, జనవరి 10 : సమస్యల పరిష్కారానికే గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని గట్టునెల్లికుదురులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకొని పరిష్కరించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రేష న్, ధరణిలో ఉన్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హ త ఉన్న వారికి రెండు గదుల ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. సరైన సమయానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే డిపో మేనేజర్తో మాట్లాడి విద్యార్థులకు అనుకూలమైన సమయంలో బస్సు నడపాలని ఆదేశించారు.
గ్రామంలోని మౌలిక వసతుల ఏర్పాటును పరిశీలించారు. సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటింటికీ వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతరావు, ఎంపీపీ మధు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచ్ సుగుణ, ఎంపీటీసీ రమేశ్, మాజీ ఎంపీపీ పర్వతాలు, ఉప సర్పంచ్ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు, రాములు, బంగారయ్య, బాబు, చంద్రారెడ్డి, సత్యనారాయణ, కిషోర్, అధికారులు పాల్గొన్నారు.