మక్తల్ టౌన్ జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మక్తల్ తాసిల్దార్ తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు, అమరేందర్, విశ్రాంత పీఈటీ గోపాలంతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, జనవరి 25: ఓటుహక్కును ఆయుధంగా మలుచుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుం చి పరేడ్ మైదానం వరకు బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలన్నారు. ర్యాలీ అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. మొదటిసారి ఓటుహక్కు పొందిన విద్యార్థులకు ఆర్డీవో ఎపిక్ కార్డులు అందజేశారు. అదేవిధంగా ఓటు ప్రాధాన్యతపై పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉ పన్యాస పోటీల్లో విజేతలకు ప్రశంశాపత్రా లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీ సీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, జె డ్పీ సీఈవో జ్యోతి, తాసిల్దార్ దానయ్య, స ర్వేయర్ మల్లేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జనవరి 25 : ప్రజాస్వామ్య దే శంలో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓ టుహక్కు పొందాలని, ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిదని ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో కాళప్ప, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు నమోదు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవా రం మండలవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అ ధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మతం, జాతి, కులం, వర్గ భేదాల కు ప్రభావం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కా ర్యక్రమంలో ఎంపీవో వేణుగోపాల్రెడ్డి, ఉ పసర్పంచ్ రహెమాన్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
దామరగిద్ద, జనవరి 25: ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రం లో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అ నంతరం ప్రధాన కూడలిలో మానవహారం గా ఏర్పడి ఓటుహక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, ఎంపీపీ నపర్సప్ప, పీఏసీసీఎస్ అధ్యక్షుడు ఈదప్ప, సర్పంచ్ ఆశమ్మ, ఉపాధ్యాయులు, వీఆర్ఏ నర్సింహ, విద్యార్థులు పాల్గొన్నారు.
కోస్గి, జనవరి 25: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కోస్గి, గుండుమల్లో బుధవారం ఓటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల కు ఓటుహక్కుపై అవగాహన కల్పించి ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో కోస్గి తాసిల్దార్ మమత, గుండుమల్ తాసిల్దార్ పాం డు, ఎంపీపీ మధుకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
మరికల్,(ధన్వాడ) జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్లో తాసిల్దార్ కార్యాలయం నుంచి బుధవారం ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో రాజకీయ నాయకులు, విద్యార్థులతో కలిసి ఓటు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీటీ శ్రీనివాసులు, ఆర్ఐ శ్రీశైలం, సిబ్బంది శివకుమార్, మంజుల, అనూష, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు రాజీవ్, భజరంగ్దళ్ మండల అధ్యక్షుడు రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.