ధరూరు, జూలై 13 : విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే బండ్ల ఉచిత బస్పాస్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఉప్పేరు నుంచి ధరూరు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారని, నేడు ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వ చ్చాయన్నారు.
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి సాధించాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్పాస్లను తన సొంత ఖర్చులతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల సతీమణి జ్యోతి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ నజుమున్నీసాబేగం, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, డీఈవో సిరాజుద్దీన్, ఎంఈవో సురేశ్, సర్పంచులు రఘవర్ధన్రెడ్డి, పద్మమ్మ, శివారెడ్డి, శ్రీరాములు, ప్రభాకర్గౌడ్, విజయభాస్కర్రెడ్డి, నాయకులు సర్వారెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణనాయడు, చక్రధర్రెడ్డి, భరత్రెడ్డి, సంజీవ్, నరేశ్, రాములు, దేవన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.