గద్వాల, జనవరి 28 : జీవన విధానంలో మార్పు రావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ప్రజలకు కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆహారం విషయంలో నియమ నిబంధనలు పాటించపోవడంతోనే గుండెపోటు వస్తుందన్నారు. మన పెద్దలు చిరు, తృణధాన్యాలు తీసుకోవడం వల్లే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాటిని ఆహారంగా తీసుకొని బలిష్టంగా ఉండాలన్నారు.
అనంతరం కరీంనగర్ ఎస్పీ సుంకరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫాస్ట్ఫుడ్ల కు ఆకర్షితులై చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురికావడం, బీపీ, షుగర్ వంటి జబ్బుల బారిన ప డుతున్నారన్నారు. అందుకే ప్రతిఒక్కరూ పోషకాహారం తీసుకొని రోగాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎస్పీతో పాటు ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వెంకటేశ్వరరెడ్డి, హైకోర్టు న్యాయవాది దేవికారెడ్డి, నిర్వాహకులు ప్రతాప్రెడ్డి, భాస్కర్రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
అంధుల జీవితం నేటి సమాజానికి ఆదర్శమని, ఎవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి భ రోసా ఇచ్చారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు చిన్న చిన్న సమస్యలను తలకుమించిన భారంగా భావిస్తూ వాటిని ఎదుర్కొనలేక ఎంతో మంది యువత తనువు చాలిస్తున్నారని, అలాంటి వారు అంధుల జీవితాన్ని ఆదర్శం గా తీసుకోవాలని సూచించారు. అంధుల పాఠశాల అ భివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, కౌ న్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నరహరిగౌడ్, కార్యక్రమ ఆర్గనైజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.