జడ్చర్ల, డిసెంబర్ 28 : అభయహస్తం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం కార్యక్రమంలో భాగంగా గురువా రం నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జడ్చర్ల మండలంలోని మా చారం, గొల్లపల్లి, నసరుల్లాబాద్, పోలేపల్లి, కిష్టా రం, నసరుల్లాబాద్తండా గ్రామ పంచాయతీల్లో ఉదయం, సాయంత్రం ఒక్కో గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటున్నారు. గ్రామ సభకు వచ్చే లబ్ధిదారులకు ఏదైన ఆరోగ్యపరమైన సమస్యలు పరీక్షించడానికి డాక్టర్.శివకాంత్ ఆధ్వర్యంలో హెల్త్క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మండలం మా చారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, క లెక్టర్ రవినాయక్ హాజరై ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనకు సంబంధించి అధికారులు గ్రామాల్లో చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యా రెంటీల పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. అలాగే కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నాట్లు తెలిపారు. ఎవరైనా గ్రామసభ నిర్వహించిన రోజు అందుబాటులో లేనిచో జనవరి 6వ తేదీ వరకు వారి దరఖాస్తులను తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జడ్చర్ల మండలంలోని ఆరు గ్రామాల్లో మొ త్తం 860 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
అభయహస్తం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల కొరత ఏర్పడిం ది. దరఖాస్తు ఫారంలు అందని వారు జనవరి 6వ తేదీ వరకు గ్రామంలో కార్యదర్శి ద్వారా పొంది దరఖాస్తులను ఇవ్వాలని సూచించారు. కార్యక్రమాలో అదనపు కలెక్టర్ మోహన్రావు, జెడ్పీ సీఈ వో జ్యోతి, ఎంఈవో మంజులాదేవి, తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్. శివకాంత్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య, ఆర్ఐలు రాఘవేంద్ర, స లావుద్దీన్, మాచారం సర్పంచ్ రవీందర్రెడ్డి, నసరుల్లాబాద్ సర్పంచ్ ప్రణిల్, గొల్లపల్లి సర్పంచ్ రా జేశ్వర్రెడ్డి, పోలేపల్లి సర్పంచ్ చేతన్రెడ్డి, కిష్టారం సర్పంచ్ నర్సింహులు, పీఏసీసీఎస్ మాజీ అధ్యక్షుడు బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాజేందర్గౌడ్, బూర్లవెంకటయ్య, సుధాకర్రెడ్డి ఉన్నారు.
బాలానగర్, డిసెంబర్ 28 : మండలంలోని పెద్దరేవల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొని ఆరు గ్యారెంటీల పోస్టర్ను అవిష్కరించారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారి, జిల్లా మాజీ కలెక్టర్ టీకే. శ్రీదేవి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఎంపీపీ కమ్లీ, తాసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తాసీల్దార్ దేవేందర్ ఉన్నారు.
రాజాపూర్, డిసెంబర్ 28 : పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు, ఖానాపూర్ గ్రా మాల్లో నిర్వాహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించారు. అనంతరం ల బ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, డీటీ భరత్కుమార్, ఆర్ఐ ఖదీర్, ఏవో నరేందర్, డాక్టర్ మధుసూదన్రావు, సర్పంచులు బచ్చిరెడ్డి, మహేశ్వరి, యాదమ్మ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, యాదయ్య, నరహరి, గోవర్ధన్రెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.
మిడ్జిల్, డిసెంబర్ 12 : ఆరు గ్యారెంటీలను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అనురుధ్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లిలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మండల కేంద్రంలో విద్యుత్ సబ్ సెష్టన్ ప్రక్కన దళిత కాలనీలో 600 గజాల ప్రభుత్వం స్థలం కబ్జా గురైందని ఎమ్మెల్యేకు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్ర త్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మండలంలో రెం డు బృందాలుగా ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, తాసీల్దార్ రాజునాయక్, ఎంపీటీసీలు గౌస్, కాంతమ్మ, రాజిరెడ్డి, శంకరయ్య, నర్సింహ పాల్గొన్నారు.
నవాబ్పేట, డిసెంబర్ 28 : రాష్ట్రం ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన ఆరుగ్యారెంటీల పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాల ని తాసీల్దార్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. మం డల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా మొత్తం 1,553 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహు లు, ప్రత్యేకాధికారి సుధాకర్, ఎంపీడీవో శ్రీలత, ఏవో కృష్ణకిశోర్, ఎంపీవో భద్రునాయక్, ఇరిగేషన్ ఏఈ అనిల్కుమార్, మాజీ జెడ్పీటీసీ రంగారావు, సర్పంచులు గోపాల్గౌడ్, కృష్ణయ్య, జంగమ్మ, పాండురంగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 28 : ప్రభు త్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల దరఖాస్తు ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో మంజుల, తాసీల్దార్ ఘన్సీరామ్ సూచించారు. గురువారం మం డలంలోని కాటవరంలో ఉదయం 8 గంటలకు, తిమ్మాయపల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో ప్రజాపాలన గ్రామ సభలను ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలోని చిన్నమునగల్చేడ్లో, పెద్దముగనల్చేడ్ గ్రామాల్లో తాసీల్దార్ ఘన్సీరామ్ ప్రజాపాలన గ్రామసభను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), డిసెంబర్ 28 : అర్హులైన ప్రతి పేదలకు సంక్షేమ ఫ లాలు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చే స్తుందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కౌకుంట్ల, అప్పంపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రా రంభించారు. అదేవిధంగా కౌకుంట్ల మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ యాదయ్య, ప్ర త్యేకాధికారి భాస్కర్, తాసీల్దార్ ఎల్లయ్య, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ స్వప్నకిషన్రావు, ఎంపీటీసీ కిష్ట న్న పాల్గొన్నారు.
ఊట్కూర్, డిసెంబర్ 28 : మున్సిపల్కేంద్రంతోపాటు ఊట్కూర్, నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మొత్తం ఐదు గ్యారెంటీలను అమలు చేసేందుకు నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ జాన్సుధాకర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సం బంధించిన అధికారులు మొత్తం 39 టీం లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యా ప్తంగా మొదటి రోజు మొత్తం 6,953 దరఖాస్తులను స్వీకరించారు.
కోస్గి, డిసెంబర్ 28 : ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెలువెత్తాయి. కోస్గి మండల కేంద్రంలోని గుండుమాల్, సరంగావుపల్లి, కుమ్మరి కుంట తండా గురువా రం మొత్తం 976 దరఖాస్తు చేసుకున్నారు. కోస్గి మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో మొ త్తం 1,037 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
గండీడ్, డిసెంబర్ 28 : గండీడ్ మండలంలో గురువారం ప్రజాపాలన దరఖాస్తు లు 522 వచ్చినట్లు తాసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి తెలిపారు. మం డలంలోని జంగంరెడ్డిపల్లి, గండీడ్, గొవిందుపల్లి, జానంపల్లి గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. గండీడ్లో 260, జం గంరెడ్డిపల్లిలో 97, జానంపల్లిలో 120, గోవిందుపల్లిలో 45 దరఖాస్తులు రాగా నా లుగు గ్రామాల్లో కలిపి ఇతరాలు 20 దరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, ఏపీవో హరిచంద్రుడు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, డిసెంబర్ 28: మండలంలోని మొకర్లాబాద్, మంగంపేట్, కంచన్పల్లి, సంగాయిపల్లి గ్రామాల్లో ప్రజాపాల న దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. నాలుగు గ్రామాల్లో కలిపి 648 దరఖాస్తులు వచ్చిన ట్లు తాసీల్దార్ యేసయ్య, ఎంపీవో శంకర్ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఛత్రునాయక్, ఏపీఎం సునీత, పీ ఆర్ఏఈ ముతిన్, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మద్దూర్ (కొత్తపల్లి), డిసెంబర్ 28 : మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాల యం, మండలంలోని రెణివట్ల, చాపాన్చెరువు తండా, సీతానాయక్ తండా తదితర గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలనలో కార్యమానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అశోక్కూమార్ పరిశీలించి గ్రామ సభలో తీసుకోవాల్సిన ఏర్పాట్లు సూచనలు చేశారు. మద్దూర్లో 964, రేణివాట్లలో 595, సీతానాయక్తండాలో 40, చాపన్చెరువు తండాలో 41 దరఖాస్తులు స్వీకరించారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 28: ప్రజా పాల న కార్యక్రమాన్ని ప్రతిఒకరూ సద్వినియో గం చేసుకోవాలని ప్రజా పాలన మక్తల్ స్పె షల్ ఆఫీసర్ జాన్ సుధాకర్ అన్నారు. మం డలంలోని మంతన్ గౌడ్ గ్రామంలో గురువారం దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మండలంలో తొలిరోజు మంతన్ గౌడ్లో 558, జక్లేర్లో 472, పసుపులలో 187, ఎర్సన్పల్లిలో 98తో కలిపి మొత్తం 1,315 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ వనజ, ఎంపీపీ వనజమ్మ, ఎంపీడీవో సద్గుణ, తాసీల్దార్ స్వర్ణరాజ్, వ్యవసాయ అధికారి పాల్గొనా ్నరు