మహబూబ్నగర్ : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఓ వినూత్నన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 న పుట్టిన తన రోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారికి ఓ సూచన చేశారు.
కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఎవరైనా శాలువాలు, బొకేలు, కేకులు, గిఫ్టులు నా దగ్గరకు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బులతో మీకు తోచిన రీతిలో మీ మీ మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఒకవేళ నా విజ్ఞప్తిని ధిక్కరించి శాలువాలు, దండలు, బొకేలు, గిఫ్టులు తెస్తే వారికి 5 వేలు జరిమానా విధించి ఆ డబ్బులతో నేనే విద్యార్థులకు సైకిళ్లు, నోటు పుస్తకాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరు సహకరించి డబ్బులను వృథా చేయకుండా మంచి పనులు, సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అప్పుడే మీరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్టు బావిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.