దేవరకద్ర, జనవరి 30: అధునిక హంగులతో గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి, బల్సుపల్లి, అజిలాపూర్ గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు.
చౌదర్పల్లిలో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన 46మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ తుమ్మల సుజాత, ముడా డైరెక్టర్ కర్ణంరాజు, తాసిల్దార్ జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచులు యుగేంధర్రెడ్డి, సుజాత, విశ్వనాథ్, సహకారసంఘం అధ్యక్షుడు నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, శంకర్, కొండ శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.