దేవరకద్ర, జూన్ 9 : దేశ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ న స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల ను పురస్కరించుకొని సంక్షేమ సం బురాలను వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఘనంగా ని ర్వహించుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సం తోషంగా ఉన్నారన్నారు. 70 ఏండ్ల ల్లో జరగని అభివృ ద్ధి సీఎం కేసీఆర్ సహకారంతో తొమ్మిదేండ్లల్లోనే చేశామని.. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే అందుకు నిదర్శమన్నా రు. అనంతరం మండల మహిళా స మాక్య ఆధ్వర్యంలో సభ్యులకు రూ. 2.79కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. బీసీ పథకం కింద నలుగురికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. దేవరకద్ర, కౌకుంట్ల, భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, చిన్నచింతకుంట మండలాలకు చెందిన 104మందికి క ల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. దేవరకద్ర మండలం అజిలాపూర్కు చెందిన 32మంది లబ్ధిదారుల కు ఇండ్ల స్థలాల పట్టాలను.. కులాంతర వివాహం చేసుకున్న రెండు జంటలకు ఎమ్మెల్యే రూ.2.50లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వ ర్ణాసుధాకర్రెడ్డి, దేవరకద్ర, భూ త్పూర్, మూసాపేట ఎంపీపీలు, జెడ్పీటీసీ అన్నపూర్ణ, తాసీల్దార్లు జ్యోతి, కిషన్, వరప్రసాద్, ఎంపీడీవోలు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు
పాల్గొన్నారు.