భూత్పూర్, సెప్టెంబర్ 11 : గ్రామాల్లో అభివృద్ధి కోసమే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం అన్నాసాగర్లో ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపాలిటీ పరిధిలోని వసురాంతండా, గెగ్యాతండా, పల్లిగుండుతండాతోపాటు తాటికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీకి చెందిన దాదాపు 100మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైస్సార్ టీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కాట్రావత్ ఆనంద్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వినోద్, శ్రీకాంత్, రాజేశ్, భాస్కర్, ఆకాశ్, పిల్లిగుండుతండాకు చెందిన శ్రీను, నీల్యా, శ్రీనివాస్, గెగ్యాతండాకు చెందిన ఎల్మనాయక్, రాజు, హన్మంతు, దేవా, గోపాల్, చింటు, వెంకటేశ్, ముస్తాఖ్, అమీర్, బషీర్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారితో పాత నాయకులు కలుపుకొని పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ బాలకోటి తదితరులు పాల్గొన్నారు.