భూత్పూర్, జనవరి 31: రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శేరిపల్లి(హెచ్) గ్రామంలో ఎమ్మెల్యే ఆల రూ.20లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, బీసీకాలనీలో రూ.5లక్షలతో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీలోని 1వ వార్డు గెగ్యతండా, వసురాంతండా, రాందాస్తండాలో బీటీరోడ్డుకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మండలంలోని తాటికొండలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తం డాల గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రగతి పథంలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ సీఎం కేసీఆర్ అధిక నిధులను మంజూరు చేసి గ్రామ పంచాయతీలను ఆదర్శంగా నిర్మిస్తున్నారని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అయినా తండాలకు బీటీరోడ్లను లేవని, సీఎం కేసీఆర్ తండాలకు బీటీరోడ్లు మంజూరు చేసి నిర్మించారని తెలిపారు. మండలంలో తండాలకు బీటీరోడ్ల నిర్మాణం కోసం రూ.12కోట్ల 60లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశ ప్రజలను ఆకర్శిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, ముడా డైరెక్టర్లు సాయిలు, చంద్రశేఖర్గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్, సర్పంచులు శేఖర్, సాయికుమార్, ఎంపీడీవో మున్ని, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, సత్యనారాయణ, వెంకట్రాములు, వెంకటేశ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే ఆల
దేవరకద్ర రూరల్, జనవరి 31: కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి దేవరకద్ర మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ జిల్లాకేంద్రంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల దవాఖానకు వెళ్లి పరామర్శించారు. అవసరమైతే హైదరాబాద్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అలాగే కౌకుంట్ల మండల నాయకులు కిషన్రావు ఈవీ గోపాల్ను పరామర్శించారు.