అలంపూర్/అయిజ రూరల్, మార్చి 26 : బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లాగా పనిచేయాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. అలంపూర్ మండలం సంకాపురంలో సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అకాల మరణం పొందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుమల్రెడ్డి, ఖగునాథ్రెడ్డి, గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు గోవిందమ్మ, మాణిక్యమ్మ చిత్రపటానికి పూలమాల వేసి రెండునిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోతున్న బీజేపీ పాలనలో సీఎం కేసీఆర్ దేశానికి శ్రీరామరక్షగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ సమ్మేళనం కార్యకర్తల మధ్య ఆత్మీ య అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కే సీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జాతరలను తలపించేలా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని కొనియాడారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు ముందుకొస్తున్నాయని.. అటువంటి వారిని తరిమికొట్టాలని సూచించారు. అనంతరం క న్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మా ట్లాడుతూ చిన్నోనిపల్లె రిజార్వాయర్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చిన్నోనిపల్లె రిజర్వాయర్ విషయం లో ఎవరు తప్పుచేశారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని.. ప్రతిపక్షాలు సిద్ధమా అని సవాలు విసిరారు. యువ నాయకుడు అజయ్ మాట్లాడు తూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద రిజర్వాయర్లు పూర్తయితే నడిగడ్డ స స్యశామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సుజాత, హనుమంతురెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు రాముడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింగ్రావు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.