పాలమూరు, నవంబర్ 30 : అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం పోతన్పల్లిలో బుధవారం రూ.10లక్షలతో మల్టీపర్పన్ కమ్యూనిటీహాల్, రూ.3లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.5లక్షలతో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీహాళ్ల ని ర్మాణంతో పేదలు ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతాయని, కమ్యూనిటీహాళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పేదల సంక్షేమానికి ప్రభు త్వం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీవో నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ఎంపీపీ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యు డు అల్లావుద్దీన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన మైనార్టీ యువకులు బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జిల్లా అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్గౌడ్ చేస్తున్న కృషిని చూసి టీఆర్ఎస్లో చేరినట్లు మహ్మద్ మతీన్ ఉర్ రహెమాన్, మహ్మద్ షఫి, సాజీద్, ఆరీఫ్, అఫ్రోజ్, హైదర్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీసెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు మగ్బుల్, అహ్మద్సనా, అశ్వక్, రసూల్, అజార్, మేహరాజ్ తదితరులు పాల్గొన్నారు.