నారాయణపేట, డిసెంబర్ 23 : యావత్తు దేశ ప్రజలకు అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నారాయణపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడా రు. జాతీయ రైతు దినోత్సవం రోజున దురదృష్టవశాత్తు నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతుల ఆక్రోశం తప్పక బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ర్టాలు తమ ఆర్థిక స్థితికి అనుకూలంగా అభివృద్ధి చెందుతున్నాయని, అలాంటి వాటిలో తెలంగాణ రాష్ట్రం ఒకటిగా చెప్పవచ్చన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక నిర్మాణాలు చేపడుతూనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రూ.10వేల 500కోట్ల సబ్సిడీని ఉచిత విద్యుత్కోసం ఇవ్వడం జరిగిందని, రూ.1500కోట్లను రైతుబీమాకు కేటాయించినట్లు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్లు సాగునీటి వనరుల ఏర్పాటుకు ఖర్చు చేసినట్లు వివరించారు.
భారమైనా ధాన్యం కొనుగోలు
సుమారు రూ.12వేలకోట్ల భారం పడినప్పటికీ రైతు లు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. వీటిలో అణాపైసా కూడా కేం ద్రానిది లేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో మెచ్చుకోవాల్సిన కేంద్రం.. కనీస సహాయం చేయాల్సిందిపోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కల్లాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా పొలాల్లోనే కల్లాలను నిర్మించే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అవసరమైన కల్లాలను రూ.151కోట్ల వ్య యంతో నిర్మి స్తే, వాటికోసం ఖర్చు చేసిన నిధులను వెనక్కి ఇవ్వాల ని తాఖీదు పంపించడం ఎంతవరకు సమంజసమన్నా రు. ఇదే విధానాన్ని బెంగాళ్, తమిళనాడు రాష్ర్టాలు కూ డా అమలు చేస్తున్నాయని, అక్కడ నిధులు వెనక్కి ఇ వ్వమని మాత్రం ఎలాంటి తాఖీదులు ఇవ్వలేదన్నారు. దేశంలో చట్టం అందరికీ ఒకేవిధంగా ఉండాలన్నారు.
రైతుల శక్తిని మరవరాదు..
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు ఉత్తర భారతదేశ రైతులు దీక్షలు చేపట్టి కేంద్రం మెడలు వంచితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ యావత్తు రైతులను క్షమాపణ కోరుతూ చట్టాలను రద్దు చేశారన్నారు. అలాంటి శక్తి రైతులకు ఉందన్న విషయాన్ని బీజేపీ నాయకులు మరవరాదని మంత్రి సూచించారు. ఉపాధి హామీ పథకం చట్టంలోనే రైతులకు అవసరమైన పనులు చేసుకోవచ్చని ఉందని, చట్టాలకు అతీతంగానే పనులు చేపడితే కేంద్రానికి ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణపై కేంద్రం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని, కేవలం కేంద్రం దుర్భరనీతిని బయట పెట్టడానికే నిరసనలు చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా కడుపున పెట్టుకొని కాపాడుకుంటామని తెలిపారు.
ఎన్నికల హామీలు ఏమైనవి..?
2014, 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నేటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. 60ఏండ్లు పైబడిన రైతులకు పింఛన్ ఇస్తామని, 2022 నాటికి రెండింతల ఆదాయం చేస్తామని, కనీస మద్దతు ధర తీసుకొస్తామని, 25లక్షల కోట్లను వ్యవయసాయ రంగానికి కేటాయిస్తామని, ముఖ్యంగా వ్యయసాయరంగాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేస్తామని, అన్నిచోట్ల గోదాములను కడతామని, వడ్డీ లేకుండా ప్రతి రైతుకూ రూ.లక్ష రు ణం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ నాయకులు.. ఒకసారి ఎన్నికల హామీలను చదువుకోవాలన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమ ని కేంద్రాన్ని కోరితే నూకలు ఉంటాయి ఎవరూ కొం టారు.. మీ తెలంగాణ ప్రజలకే తినిపించాలని ఎగతాళి చేశారని, పైగా కేంద్రం వద్దనే పెద్దఎత్తున ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పడం జరిగిందన్నారు. కానీ నేడు దేశంలో ధాన్యం కొరత ఉందని, విదేశాలకు ధాన్యం, గోధుమల ఎగుమతులపై నిషేధం విధించినట్లు తెలిపారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని పరిపాలించే నాయకులకు ధాన్యం నిల్వలు ఉం చుకోవాలన్నా దీర్ఘకాల ప్రణాళిక లేకపోవడం తగదన్నారు. పెట్రోల్, డీజీల్, నిత్యవసర ధరల తగ్గుదలపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. 2014 ఎన్నికల సభలో తాము అధికారంలోకి వస్తే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతామని సాక్షాత్తు పాలమూరు వేదికపై ప్రకటించిన నరేంద్రమోదీ.. నేడు అదే పథకానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లే కున్నా తెలంగాణ ప్రభుత్వమే చేపడుతుంటే రూ.900 కోట్లు కట్టమని తాఖీదులు ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో 18 రాష్ర్టా ల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు గత ఎనిమిదేండ్ల కాలంలో కనీసం 10లక్షల ఎకరాలకు నీరు పారే ప్రాజెక్టులను ఒక్కటి కూడా కట్టలేదన్నారు. తెలంగాణ పంట దేశ సంపద కాదా అని, ఇక్కడి ప్రజలకు సర్వభౌమ అధికారాలు లేవా అని, తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ధాన్యం పండుతుంటే, తెలంగాణలో కోటీ 10వేల ఎకరాల్లో ధాన్యం పండుతుందన్నారు. మేము అమలు చేసేదే రాజ్యాంగం, నియంతలా వ్యవహరిస్తామని బీజేపీ నాయకులు భావిస్తే ముందుగా ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడాలన్నారు. చంద్రబాబునాయుడు మళ్లీ ఆశలు పెట్టుకొని తెలంగాణలో అడుగుపెడితే భంగపాటుకు గురికావడం ఖాయమని అన్నారు. బాబు కారణంగా వల్లకాడైన తెలంగాణ.. ఇప్పుడిప్పుడే బాగు పడుతుందని, మళ్లీ వచ్చి విషం చిమ్మరాదని సూచించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణ, రైతుబంధు సమితి సభ్యుడు భీమయ్యగౌడ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, నాయకులు సుదర్శన్రెడ్డి, గందె చంద్రకాంత్, ప్రతాప్రెడ్డి, సరాఫ్ నాగరాజు, కన్నజగదీశ్, చెన్నారెడ్డి, వినోద్, శ్రీపాద్ తదితరులు ఉన్నారు.