పల్లెపల్లెనా ప్రగతి మురిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రగతి పండుగ నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల ఎదుట జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులు, మహిళల ఆటాపాట, రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పారిశుధ్య సేవలకుగానూ కార్మికులనుసత్కరించారు. వనపర్తి జిల్లాలో జరిగిన సంబురాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, హన్వాడలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డప్పు కొట్టి ప్రజలను ఉత్సాహపర్చారు.
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోయాయని, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణలోని పల్లెలు నిలిచాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మం డల కేంద్రంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎం పికైన గ్రామాల సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, నర్సరీలు, హరితహారం మొక్కలు, పరిశుభ్రత, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, సాగునీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించడంతో తెలంగాణ పల్లెలు దేశానికే దిక్సూచిగా నిలిచాయన్నారు.
చెత్తను తరలించేందుకు, మొక్కలకు నీళ్లు పట్టేందుకు ప్రత్యేక ట్రాక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటడంతో పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పల్లెల్లో ఉన్న సౌకర్యాలు, తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజల కళ్లకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశంలో ఎక ్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. మండలంలో 1,626 మందికి కల్యాణలక్ష్మి, 15,539 మంది రైతులకు రూ.133కోట్ల రైతుబంధు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 271మంది బాధిత కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రైతుబీమా అందించి అండగా నిలిచామన్నారు. త్వరలోనే మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని వేపూర్, గొండ్యాల వాగుపై నాలుగు చెక్డ్యాంలను నిర్మిస్తున్నామని, వీటి వల్ల భూగర్భజలాలు పుష్కలంగా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, డీఆర్డీవో పీడీ యాదయ్య, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసీల్దార్ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్ పాల్గొన్నారు.
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని పెద్దగూడెంలో పల్లెప్రగతి ఉత్సవాల్లో భాగంగా నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో క లిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో గ్రా మ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయన్నారు.
ఇందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన అవార్డులే ని దర్శనమని అన్నారు. మండలంలోనే పెద్దగూడెం కు ప్రత్యేకత కల్గి ఉన్నదని, భవన గ్రామ పంచాయతీ భవనం ప్రజల కోరిక మేరకు జీ ప్లస్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. గ్రామంలో రూ.8.50కోట్లతో వివిధ అభివృ ద్ధి పనులు చేపట్టామన్నారు. ఖాన్చెరువుకు సాగునీళ్ల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశామని, శ్వా శత పరిష్కారం దిశగా దత్తాయిప ల్లి తండా శివారులో కాల్వ పనులను రూ.18కోట్ల 65లక్షలతో పనులను చేపట్టామన్నారు. అ నంతరం గ్రామ పంచాయతీ లో ఉత్తమ సేవలందించిన కార్మికులను స న్మానించి, ప్రశంసాపత్రాలను అధికారులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొం డన్న, ఎంపీటీసీ లు కురుమూర్తి, ధర్మనాయక్, ఉపసర్పంచ్ భాస్కర్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో పర్యటన..
మండలంలో మంత్రి నిరంజన్రెడ్డి కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్తో కలిసి విస్తృతంగా పర్యటించారు. పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయానికి శంకుస్థాప న, గోదాం ప్రారంభోత్సవం, కంచిరావుపల్లిలో వడ్డెర సంఘం భవ నం ప్రారంభం, కంచిరావుపల్లి తండా, తోమాలపల్లెలో పంచాయతీ భవనాలకు శంకుస్థాపన, వై-శాఖాపురం, రంగాపురం గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రా లు, పంచాయతీ భవనాలు, పెంచికలపాడు, కొత్త సూగూరులో పంచాయతీ భవనాల కు శంకుస్థాపన, గుమ్మడం లో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం గుమ్మడంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు.