ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. శనివారం గిరిజన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించగా.. లంబాడీల ఆటాపాట ఆకట్టుకున్నాయి. హన్వాడ మండలం ఏనెమీది తండాలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డప్పు కొట్టి ప్రజలను ఉత్సాహపర్చారు. నవాబ్పేట మండలం ఊరంచుతండాలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్టెప్పులేశారు. ఆయా తండాల్లో అతిథులకు గిరిజనులు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు.
– నెట్వర్క్, మహబూబ్నగర్, జూన్ 17